News October 17, 2024
6Gలో భారత్ అగ్రగామిగా నిలిచేలా..!
IIT మద్రాస్ టెలికమ్యూనికేషన్ ల్యాండ్స్కేప్లో విప్లవాత్మక మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తోంది. 6G ట్రయల్స్ కోసం టెస్ట్ బెడ్ యూనిట్ను ప్రారంభించింది. ఇందులో 6397MBPS ఇంటర్నెట్ స్పీడ్తో టెస్టింగ్ దశలో ఉన్న ఓ ఫొటో వైరలవుతోంది. 2030 నాటికి 6G టెక్నాలజీలో భారతదేశాన్ని అగ్రగామిగా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. భారత్ 6G విజన్ స్తోమత, సుస్థిరత, సర్వవ్యాప్తి అనే మూడు సూత్రాలతో పనిచేస్తోంది.
Similar News
News October 17, 2024
STOCK MARKETS క్రాష్.. రూ.3 లక్షల కోట్లు ఆవిరి
భారత స్టాక్ మార్కెట్లలో బ్లడ్బాత్ కొనసాగుతోంది. నెగటివ్ సెంటిమెంటుతో బెంచ్మార్క్ సూచీలు క్రాష్ అవ్వడంతో రూ.3 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. మధ్యాహ్నం బీఎస్ఈ సెన్సెక్స్ 80,952 (-548), ఎన్ఎస్ఈ నిఫ్టీ 24,740 (-231) వద్ద ట్రేడవుతున్నాయి. బజాజ్ ఆటో ఇంట్రాడేలో 12% నష్టపోయింది. ఆటో షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ విపరీతంగా ఉంది. Infy, TechM, LT, SBIN, పవర్ గ్రిడ్ టాప్ గెయినర్స్.
News October 17, 2024
భారత్ చెత్త రికార్డు
కివీస్తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్సులో భారత్ 46 పరుగులకే చాపచుట్టేసింది. ఇది టీమ్ ఇండియాకు మూడో అత్యల్ప స్కోరు. 2020లో 36(vsAUS), 1974లో 42(vsENG) పరుగులకు ఆలౌటైంది. ఆయా టెస్టుల్లో థర్డ్ ఇన్నింగ్సులో లోయెస్ట్ స్కోరుకు కుప్పకూలగా, సొంత గడ్డపై తొలి ఇన్నింగ్సులో భారత్కు ఇదే అత్యల్ప స్కోరు. స్వదేశంలో ఒక ఇన్నింగ్సులో ఐదుగురు డకౌట్ కావడం 25 ఏళ్లలో ఇదే తొలిసారి.
News October 17, 2024
ఉప్పల్ స్టేడియం కేసులో ఈడీ దూకుడు
TG: ఉప్పల్ స్టేడియంలో నిధుల గోల్మాల్ కేసులో 3కంపెనీలకు ED సమన్లు జారీ చేసింది. ఈ నెల 8న అజారుద్దీన్ను విచారించిన ED, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బాడీడ్రెంచ్ ఇండియా, సర స్పోర్ట్స్, ఎక్స్లెంట్ ఎంటర్ప్రైజెస్కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు రావాలని ఆదేశించింది. జనరేటర్స్, జిమ్ పరికరాలు, క్రికెట్ బాల్స్, ఇతర వస్తువుల్లో అక్రమాలు జరిగాయని అజారుద్దీన్పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.