News October 17, 2024
పంత్కు షాక్.. ఢిల్లీ కెప్టెన్గా అక్షర్ పటేల్?
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక మార్పులు చేస్తోంది. ఇప్పటికే హెడ్ కోచ్ రికీ పాంటింగ్ను తప్పించగా, కెప్టెన్ రిషభ్ పంత్పైనా వేటు వేయనున్నట్లు సమాచారం. అతని స్థానంలో అక్షర్ పటేల్కు సారథ్య బాధ్యతలు అప్పగించనుందని వార్తలు వస్తున్నాయి. అయితే పంత్ను రూ.18 కోట్లకు రిటెన్షన్ చేసుకుంటుందని తెలుస్తోంది. కాగా తాను వేలంలో పాల్గొంటే ఎంత రేటు రావొచ్చని ఇటీవల రిషభ్ చేసిన <<14336476>>ట్వీట్<<>> వైరలైన విషయం తెలిసిందే.
Similar News
News October 17, 2024
షేక్ హసీనాపై అరెస్ట్ వారెంట్ జారీ
భారత్లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ PM షేక్ హసీనాపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. NOV 18లోపు ఆమెను అరెస్ట్ చేసి తమ ఎదుట హాజరుపర్చాలని ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. రిజర్వేషన్లపై ఆ దేశంలో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఆమె బంగ్లాను వీడిన సంగతి తెలిసిందే. ఆమెపై క్రిమినల్ కేసులు సైతం నమోదయ్యాయి. కాగా ఆమె భారత్ చేరుకున్న తర్వాత బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు.
News October 17, 2024
ఇండియా నుంచి ఒకే ఒక్కడు!
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మోస్ట్ హ్యాండ్సమ్ ఇండియన్ యాక్టర్గా నిలిచారు. లండన్లోని ఫేషియల్ కాస్మొటిక్ సర్జన్ డా. జూలియన్ డి సిల్వా గోల్డెన్ రేషియో కాన్సెప్ట్తో ప్రపంచంలోని హ్యాండ్సమ్ నటుల జాబితాను రూపొందించారు. అందులో ఏకైక భారతీయ నటుడు షారూఖ్ ఖాన్(86.76%) పదవ స్థానంలో నిలిచారు. ఇంగ్లిష్ యాక్టర్ ఆరోన్ టేలర్ జాన్సన్ (93.04%)తో ప్రథమ స్థానంలో, లూసీన్ లావిస్కౌంట్ (92.41%) రెండో స్థానంలో ఉన్నారు.
News October 17, 2024
పుజారా సేవల్ని భారత్ మిస్ అయింది: కుంబ్లే
న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా పూజారా సేవల్ని మిస్ అయిందని మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డారు. చుట్టూ వికెట్లు పడుతున్నా పుజారా గౌరవప్రదమైన స్కోరును జట్టుకు అందించేవారని పేర్కొన్నారు. ‘100 మ్యాచులాడిన అలాంటి ఆటగాడి సేవల్ని భారత్ మిస్ అయింది. అతడైతే బంతిని కొట్టేందుకు వెళ్లకుండా బ్యాట్ మీదకు వచ్చేవరకూ వేచి చూసేవారు. విరాట్ 4వ స్థానంలోనే ఆడాల్సింది’ అని పేర్కొన్నారు.