News October 17, 2024

వైసీపీలోకి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి

image

AP: వైసీపీ నేతలు అధికారంలో ఉన్న కూటమి పార్టీల్లో చేరుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ముదునూరి మురళీకృష్ణం రాజు ఆ పార్టీని వీడారు. ప్రస్తుతం ఆయన టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా, అమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు ఉన్నారు. ఇవాళ మాజీ సీఎం జగన్ సమక్షంలో మురళీకృష్ణంరాజు వైసీపీలో చేరారు.

Similar News

News November 14, 2025

శ్రీమహావిష్ణువు అనుగ్రహాన్ని పొందాలంటే?

image

తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం|
ధ్యాయన్ స్తువన్నమస్యంశ్చ యజమానస్తమేవ చ||
శాశ్వతమైన పరమాత్మను నిరంతరం ఆరాధించాలని, ఆయననే ప్రధానంగా పూజించాలని ఈ శ్లోకార్థం. భగవంతుడ్ని ధ్యానిస్తూ, స్తుతిస్తూ, నమస్కరిస్తూ, ప్రతి కర్మనూ అంకితం చేయాలి. ప్రతి ఆలోచన ఆ పరమాత్మకే అర్పించాలి. తద్వారానే ఆయన అనుగ్రహం పొందగలం. అందుకే అనుక్షణం పరమాత్మ చింతనతో జీవించాలని పండితులు చెబుతారు.<<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News November 14, 2025

యూనివర్సిటీ ఆఫ్ HYDలో JRF పోస్టులు

image

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌ JRFపోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు GATE/CSIR/UGC-NET అర్హత సాధించి ఉండాలి. లైఫ్‌సైన్స్‌లో JRFకు ఈ నెల 20 ఆఖరు తేదీ కాగా, అట్మాస్ఫియరిక్ సైన్సెస్/ఓషియన్,మెటియోరాలజీ, ఫిజికల్ ఓషనోగ్రఫీ, జియాలజీ విభాగంలో JRFకు ఈ నెల 27 ఆఖరు తేదీ.

News November 14, 2025

జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ ఘన విజయం

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ జయకేతనం ఎగురవేశారు. BRS అభ్యర్థి మాగంటి సునీతపై భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. గతంలో ఇక్కడి నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓడిన నవీన్.. ఈసారి ఉపఎన్నికలో సత్తా చాటారు. దాదాపు 25వేల ఓట్ల మెజారిటీతో జూబ్లీహిల్స్ అడ్డాలో కాంగ్రెస్ జెండా పాతారు.