News October 17, 2024
బెయిల్ కండీషన్.. ‘భారత్ మాతాకీ జై చెప్పాల్సిందే’
మధ్యప్రదేశ్లో ‘పాకిస్థాన్ జిందాబాద్.. హిందుస్థాన్ ముర్దాబాద్’ నినాదాలు చేసిన నిందితుడు ఫైజల్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసు ముగిసే వరకు ప్రతి నెలా మొదటి, చివరి మంగళవారం మిస్రోడ్ పోలీస్ స్టేషన్లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినదిస్తూ అక్కడి జాతీయ జెండాకు 21సార్లు సెల్యూట్ చేయాలని స్పష్టం చేసింది. స్టేట్ కౌన్సిల్ బెయిల్కు అడ్డుచెప్పగా, న్యాయమూర్తి తోసిపుచ్చారు.
Similar News
News October 17, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నారాయణపేట, గద్వాల, నాగర్ కర్నూల్, MBNR, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, జనగామ, వరంగల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, NZB, జగిత్యాల, కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మం తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.
News October 17, 2024
‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది: కంగన
తన సినిమా ఎమర్జెన్సీకి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిందని నటి కంగనా రనౌత్ వెల్లడించారు. సర్టిఫికేట్ రావడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు. అభిమానులు సహనంతో ఉండి మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఇందులో ఇందిరా గాంధీని, ఒక వర్గం ప్రజలను తప్పుగా చూపించారంటూ అభ్యంతరాలు వ్యక్తం అయిన సంగతి తెలిసిందే.
News October 17, 2024
తల్లిదండ్రుల కోసమే ఆ సినిమా చేశాను: షారుఖ్
2003లో రిలీజైన ‘దేవదాస్’ సినిమా షారుఖ్ ఖాన్ కెరీర్లో ఓ లాండ్ మార్క్ మూవీగా నిలిచింది. అయితే ఆ సినిమాలో తాను నటించాలనుకోలేదని ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ‘నా కెరీర్లో అప్పటి వరకు భారీతనంతో కూడిన సినిమా లేదు. స్వర్గంలో ఉన్న నా తల్లిదండ్రులు నన్ను చూస్తుంటారని నా నమ్మకం. వారు పైనుంచి నన్ను చూసి గర్వపడేలా చేయాలనుకున్నాను. అందుకే సన్నిహితులు వద్దన్నా ఆ సినిమా ఒప్పుకొన్నాను’ అని వివరించారు.