News October 17, 2024

మందుబాబులకు షాక్.. పెరగనున్న మద్యం ధరలు?

image

TG: మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీర్ల ఉత్పత్తి కేంద్రాలకు చెల్లించే ధరలను సర్కార్ రెండేళ్లకోసారి పెంచుతోంది. ఈసారి వివిధ రకాల బ్రాండ్లపై రూ.20-150 వరకు పెంచాలని బ్రూవరీలు కోరాయి. ఈమేరకు త్వరలోనే ప్రభుత్వం ధరల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మద్యం ఆదాయాన్ని ఎక్సైజ్‌ శాఖ అదనంగా మరో రూ.5,318 కోట్లకు పెంచాలన్న ప్రభుత్వ ఆదేశాలూ ధరల పెంపునకు మరో కారణంగా తెలుస్తోంది.

Similar News

News October 17, 2024

‘పుష్ప-2’ సంచలనం!

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ రిలీజ్‌కు ముందే సంచలనాలు నమోదు చేస్తోంది. సినిమా DEC 6న రిలీజ్ కానుండగా అప్పుడే రూ.900 కోట్ల బిజినెస్ చేసినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. డిజిటల్ & శాటిలైట్ రైట్స్‌ను ఆల్‌టైమ్ రికార్డు ధరకు విక్రయించినట్లు టాక్. థియేట్రికల్ రైట్సే రూ.650 కోట్లకు కోట్ చేశారని సమాచారం. ‘పుష్ప’కు సీక్వెల్‌గా వస్తుండటంతో భారీ అంచనాలున్నాయి.

News October 17, 2024

సీఎం రేవంత్ కామెంట్స్‌పై రేపు మాట్లాడతా: KTR

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్‌పై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. మూసీ పునరుజ్జీవం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను రేపు సాయంత్రం 4 గంటలకు బీఆర్ఎస్ భవన్‌లో ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తానని ఆయన ట్వీట్ చేశారు. మూసీ ప్రాజెక్ట్‌ గురించి సీఎం రేవంత్ చేసిన కామెంట్స్‌పై మాట్లాడతానని చెప్పారు.

News October 17, 2024

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. మళ్లీ వర్షాలు

image

AP: ఈనెల 22న మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD ప్రకటించింది. దీని ప్రభావంతో రేపు కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, NTR, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని వెల్లడించింది. కాగా వాయుగుండం ఇవాళే తీరం దాటిన విషయం తెలిసిందే.