News October 17, 2024
ఆ ప్లాంట్లో కోటి కార్లు ఉత్పత్తి చేశాం: మారుతి
హరియాణాలోని మానేసర్ ప్లాంట్ మొదలైనప్పటి నుంచి తమ సంస్థ అక్కడ కోటి కార్లను ఉత్పత్తి చేసిందని మారుతీ సుజుకీ ఓ ప్రకటనలో తెలిపింది. కేవలం 18 ఏళ్లలోనే ఈ ఘనత సాధించినట్లు పేర్కొంది. గురుగ్రామ్, మానేసర్, గుజరాత్లో మారుతికి ఉత్పత్తి ప్లాంట్లున్నాయి. మానేసర్లో బ్రెజా, ఎర్టిగా, ఎక్స్ఎల్ 6, సియాజ్, డిజైర్, వాగన్ ఆర్, ఎస్ ప్రెస్సో కార్లను తయారు చేసి భారత్తో పాటు విదేశాలకూ ఎగుమతి చేస్తోంది.
Similar News
News October 17, 2024
థాంక్యూ పవన్ కళ్యాణ్: పన్నీర్ సెల్వం
AIADMK వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ వరస ట్వీట్లలో ఆ పార్టీకి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. ఆ విషెస్పై ఆ పార్టీ కో-ఆర్డినేటర్ పన్నీర్ సెల్వం స్పందించారు. ‘డియర్ పవన్ కళ్యాణ్, AIADMK 53వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మీరు విష్ చేసినందుకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు. సనాతన ధర్మం విషయంలో డీఎంకేతో విభేదాల నేపథ్యంలో పవన్ AIADMKకి విషెస్ చెప్పడం ఆసక్తికరం.
News October 17, 2024
ఇజ్రాయెల్ దాడిలో హమాస్ చీఫ్ హతం!
హమాస్తో యుద్ధంలో ఇజ్రాయెల్ మరోసారి పైచేయి సాధించింది. హమాస్ చీఫ్ యాహ్య సిన్వర్ను మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. గాజాలో ఆ దేశ మిలిటరీ ముగ్గురిని హతమార్చింది. ఇందులో సిన్వర్ కూడా ఉన్నట్లు అనుమానిస్తోంది. అయితే ఇంకా నిర్ధారించాల్సి ఉందని IDF తెలిపింది. గతేడాది OCT 7న ఇజ్రాయెల్పై తొలిసారి దాడిలో మాస్టర్ మైండ్ సిన్వర్దే. సిన్వర్ కంటే ముందు హమాస్ చీఫ్ హనియాను కూడా ఇజ్రాయెల్ ఎలిమినేట్ చేసింది.
News October 17, 2024
కేంద్రానికి రైతు సంఘాల హెచ్చరిక
ఢిల్లీ రైతు ఉద్యమానికి నాలుగేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సంయుక్త్ కిసాన్ మోర్చా మరో సారి ర్యాలీలకు పిలుపునిచ్చింది. నవంబర్ 26న దేశంలోని 500 జిల్లాల్లో హెచ్చరిక ర్యాలీలు చేపడుతామని తెలిపింది. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే వచ్చే ఏడాది మరో ఉద్యమం తప్పదని హెచ్చరించింది.