News October 17, 2024
‘పుష్ప-2’ సంచలనం!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ రిలీజ్కు ముందే సంచలనాలు నమోదు చేస్తోంది. సినిమా DEC 6న రిలీజ్ కానుండగా అప్పుడే రూ.900 కోట్ల బిజినెస్ చేసినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. డిజిటల్ & శాటిలైట్ రైట్స్ను ఆల్టైమ్ రికార్డు ధరకు విక్రయించినట్లు టాక్. థియేట్రికల్ రైట్సే రూ.650 కోట్లకు కోట్ చేశారని సమాచారం. ‘పుష్ప’కు సీక్వెల్గా వస్తుండటంతో భారీ అంచనాలున్నాయి.
Similar News
News October 18, 2024
ఈరోజు ఈ ఏడాదిలోనే అతి పెద్ద చంద్ర దర్శనం!
ఈ ఏడాదిలోనే అతి పెద్ద చంద్రుడు ఆకాశంలో శుక్రవారం తెల్లవారుజామున దర్శనమివ్వనున్నాడు. ఈ చంద్రబింబాన్ని ‘హంటర్స్ మూన్’ లేదా సూపర్ మూన్గా చెబుతారు. తెల్లవారుజాము 4.30 గంటలకు చంద్రుడు సాధారణంకంటే 14శాతం పెద్దగా, 30శాతం ప్రకాశవంతంగా కనిపిస్తాడని ఖగోళ పరిశోధకులు తెలిపారు. ఈ ఏడాది సూపర్మూన్స్లో ఇది రెండోది కావడం గమనార్హం.
News October 18, 2024
ఈ నెల 21న దక్షిణ కొరియాకు మంత్రులు, ఎమ్మెల్యేలు
TG: మూసీ పునరుజ్జీవం కోసం అధ్యయనం చేసేందుకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, అధికారులు దక్షిణ కొరియాకు వెళ్లనున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు వారు సియోల్లో పర్యటిస్తారు. స్థానికంగా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్పై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నారు.
News October 18, 2024
భారత్ టాస్ మాత్రమే గెలిచి అంతా ఓడింది: అజయ్ జడేజా
న్యూజిలాండ్తో టెస్టులో భారత్ ఆడిన విధానంపై మాజీ క్రికెటర్ అజయ్ జడేజా విమర్శలు గుప్పించారు. మ్యాచ్లో టాస్ గెలవడం ఒకటే భారత్ చేసిన మంచి పని అని తేల్చిచెప్పారు. ‘రెండో రోజు టాస్ తప్ప మిగిలిన ఆటంతా భారత్ ఓడింది. బౌలింగ్పరంగా ఫర్వాలేదనిపించారు కానీ బ్యాటింగ్ నిర్లక్ష్యంగా, ఫీల్డింగ్ నీరసంగా కనిపించింది. బ్యాటర్లు వికెట్లను చేజేతులా సమర్పించుకున్నారు’ అని విమర్శించారు.