News October 17, 2024

రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్

image

TG: రాష్ట్రంలో జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న విధానం మాదిరే ఒకరికి 6కేజీల చొప్పున బియ్యం అందిస్తామన్నారు. అటు త్వరలో కొత్తగా జారీ చేసే ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వెల్లడించారు. అర్హులైన నిరుపేదలనే ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Similar News

News October 18, 2024

అంటార్కిటికాలో మిస్టరీ తలుపు.. నిపుణులేమంటున్నారంటే..

image

అంటార్కిటికాలో ఓ మంచు కొండకు తలుపులా ఉన్న ఆకారం గూగుల్ మ్యాప్‌లో ఓ నెటిజన్‌కు కనిపించింది. అదేదో రహస్య ప్రాంతంలా ఉందంటూ అతడు రెడిట్‌లో పోస్ట్ పెట్టగా అది చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్ట్ వైరల్ కాగా, అమెరికాలోని న్యూకాజిల్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ స్పష్టతనిచ్చారు. ‘చూసేందుకు తలుపులా ఉన్నప్పటికీ అది కొండ నుంచి పొడుచుకొచ్చిన రాతి భాగం కావొచ్చు. మంచు ఘనీభవించడంతో అలా కనిపిస్తోంది’ అని వివరించారు.

News October 18, 2024

రెండు భాగాలుగా మహేశ్-రాజమౌళి సినిమా?

image

సూపర్‌స్టార్ మహేశ్‌తో రాజమౌళి తెరకెక్కించే సినిమా 2 భాగాలుగా రానుందా? నెట్టింట ఇదే చర్చ నడుస్తోంది. కథ విస్తృతమైనది కావడంతో ఒక భాగంలో మొత్తం చెప్పడం సాధ్యం కాదని, 2 భాగాలుగా తీయాలని రాజమౌళి అండ్ కో భావిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వీటికి లభించే ఆదరణ బట్టి మున్ముందు మరిన్ని సీక్వెల్స్ కూడా వచ్చేందుకు అవకాశం ఉందంటున్నాయి. మూవీ టీమ్ నుంచి దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

News October 18, 2024

‘నాయుడుగారి తాలూకా’ అంటున్న నాని

image

న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి ‘నాయుడుగారి తాలూకా’ టైటిల్ పరిశీలిస్తున్నట్లు టాక్. నాని సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుందని సమాచారం. చెరుకూరి సుధాకర్ నిర్మాతగా వ్యవహరించనున్నారు.