News October 17, 2024

గ్రూప్-1 మెయిన్స్ వాయిదా లేనట్లేనా?

image

TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇవాళ ప్రెస్ మీట్‌లో వాయిదా విషయమై అడిగిన ప్రశ్నకు ఇది సందర్భం కాదని సీఎం దాటవేశారు. మరోవైపు సీఎస్ శాంతికుమారి ఇప్పటికే పరీక్ష ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీంతో వాయిదా పడే అవకాశం లేదని కొందరు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

Similar News

News October 18, 2024

YAHYA SINWAR: రెండు దశాబ్దాలు జైల్లోనే

image

హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్‌ను ఐడీఎఫ్ దళాలు మట్టుబెట్టాయి. కాగా సిన్వర్ 1962లో గాజాలోని ఖాన్ యూనిస్‌లో జన్మించారు. గాజా వర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్నవారిని హత్య చేసినందుకు సిన్వర్‌ను 1988లో అరెస్ట్ చేశారు. 2011 వరకు ఆయన ఇజ్రాయెల్ జైల్లోనే గడిపారు. ఆ తర్వాత బయటకు వచ్చి హమాస్‌లో వేగంగా ఎదిగారు. 2015లో అతడిని US ఉగ్రవాదిగా ప్రకటించింది. 2017లో హమాస్ చీఫ్‌గా ఎన్నికయ్యారు.

News October 18, 2024

నన్ను క్యూటీ అంటావా..? జెప్టోపై యువతి ఆగ్రహం

image

జెప్టో యాప్ తనను ‘క్యూటీ’గా సంబోధిస్తూ పుష్ నోటిఫికేషన్ పంపించడంపై బెంగళూరుకు చెందిన మహక్ అనే యువతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మహిళలపై అక్రమాలను ప్రశ్నించే యుగంలో ఉన్నాం మనం. నేనెవరో తెలియకుండా అలా క్యూటీ అని పంపించడమేంటి? నేను షాకయ్యా’ అని లింక్డ్‌ ఇన్‌లో ఆమె మండిపడ్డారు. కొంతమంది ఆమెకు మద్దతునిస్తుండగా, మరికొంతమంది మాత్రం చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారంటూ ఆమెను విమర్శిస్తున్నారు.

News October 18, 2024

ఒంటరిగా మారుతోన్న భారత్?

image

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంలో భారత్ తన వైఖరి తేల్చిచెప్పలేకపోతోంది. ప్రపంచంలోని మెజారిటీ దేశాలు ఖండిస్తున్నా, మన దేశం మాత్రం ఐక్యరాజ్యసమితిలో తన అభిప్రాయాన్ని చెప్పలేకపోతోంది. చివరకు నాటో దేశాలు కూడా పాలస్తీనా మారణహోమంపై ఇజ్రాయెల్‌ను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలతో ఇండియా ఒంటరి అవుతున్నట్లే కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.