News October 18, 2024
ఒంటరిగా మారుతోన్న భారత్?
ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంలో భారత్ తన వైఖరి తేల్చిచెప్పలేకపోతోంది. ప్రపంచంలోని మెజారిటీ దేశాలు ఖండిస్తున్నా, మన దేశం మాత్రం ఐక్యరాజ్యసమితిలో తన అభిప్రాయాన్ని చెప్పలేకపోతోంది. చివరకు నాటో దేశాలు కూడా పాలస్తీనా మారణహోమంపై ఇజ్రాయెల్ను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలతో ఇండియా ఒంటరి అవుతున్నట్లే కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News October 18, 2024
కెనడాలో బలమైన భారతీయ సమాజం
కెనడాలో 28 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో 18 లక్షల భారత సంతతివారు, 10 లక్షల మంది ప్రవాసులు ఉన్నారు. వాంకోవర్, టొరంటో, మాంట్రియల్, విన్నీ పెగ్, ఒట్టావా ప్రాంతాల్లో అధికంగా జీవిస్తున్నారు. అక్కడ చదివే విదేశీ విద్యార్థుల్లో 45 శాతం మంది భారతీయులే. అక్కడి పథకాల్లో ప్రధాన లబ్ధిదారులూ మనవాళ్లే. 2019లో కెనడా వెళ్లిన భారతీయుల సంఖ్య 2.46 లక్షలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 28 లక్షలకు చేరుకుంది.
News October 18, 2024
శ్వేతపత్రాలపై ఏం చేశారు? నివేదికివ్వండి: సీఎం చంద్రబాబు
AP: వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందంటూ సీఎం చంద్రబాబు 2 నెలల కిందట పలు రంగాలపై శ్వేత పత్రాలు విడుదల చేశారు. అయితే ఆయా శాఖలు వాటిపై ఎలాంటి కార్యాచరణ చేపట్టాయో ప్రభుత్వానికి నివేదించలేదు. దీనిపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. శ్వేతపత్రాలపై తీసుకున్న చర్యలు, జరుగుతున్న విచారణలు వంటి అంశాలపై సమగ్ర నివేదికను వెంటనే ఇవ్వాలని ఆదేశించారు.
News October 18, 2024
హరీశ్ రావు బంధువులపై చీటింగ్ కేసు నమోదు
TG: మాజీ మంత్రి హరీశ్రావు తమ్ముడు, మరదలు, మేనమామతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు, ఫాస్మో కంపెనీపై మియాపూర్లో ట్రెస్పాస్, చీటింగ్ కేసు నమోదైంది. తనకు తెలియకుండా ఇంటిని అమ్మేశారని, అక్రమంగా వచ్చి ఉంటున్నారని దండు లచ్చిరాజు అనే వ్యక్తి పీఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో జంపన ప్రభావతి, తన్నీరు గౌతమ్, తన్నీరు పద్మజారావు, బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోని రాజకుమార్, గారపాటి నాగరవిపై కేసు నమోదైంది.