News October 18, 2024
నిర్దేశించిన ధరలకే వంటనూనెలను విక్రయించాలి: విశాఖ జేసీ

విశాఖ జిల్లాలోని రైతుబజార్లలో సన్ఫ్లవర్, పామ్ ఆయిల్ నూనెలను నిర్దేశించిన ధరలకే విక్రయించాలని జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ రూ.124, పామాయిల్ రూ.110కి మాత్రమే విక్రయించాలని స్పష్టం చేశారు. ఒక కార్డుపై నెలకు 3 ప్యాకెట్ల పామాయిల్, ఒక ప్యాకెట్ సన్ఫ్లవర్ ఆయిల్ అందజేయాలన్నారు. దీనిపై ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా 0891-2590100 కు సంప్రదించాలన్నారు.
Similar News
News September 17, 2025
విశాఖ: మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

విశాఖలోని ఓ వైద్య కళాశాలలో చదువుతున్న విద్యార్థి బుధవారం మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం చంబా జిల్లాకు చెందిన విస్మద్ సింగ్గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News September 17, 2025
విశాఖలో హెల్త్ క్యాంప్ను సందర్శించిన సీఎం

CM చంద్రబాబు విశాఖలో నిర్వహించిన ‘స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ <<17736648>>హెల్త్ క్యాంప్<<>>ను సందర్శించారు. గ్రామాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లకు మహిళలు ముందుకు రావడం లేదని, వారికి అవగాహన కల్పించి విలేజ్ క్లీనిక్ సెంటర్లో టెస్ట్లు చేసుకునేలా చర్యలు చేపట్టినట్లు మంత్రి సత్యకుమార్ CMకి వివరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను పరిశీలించిన CM ఓ చంటి బిడ్డకు డ్రాప్స్ వేశారు.
News September 17, 2025
విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు బుధవారం విశాఖ చేరుకున్నారు. ఎయిర్పోర్టులో ఆయనకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం కాన్వాయ్ ఎయిర్పోర్ట్ నుంచి AU సాగరిక ఫంక్షన్ హాల్కు బయలుదేరింది. మహిళా ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ హెల్త్ క్యాంప్ సందర్శిస్తారు. అనంతరం AU కన్వెన్షన్ సెంటర్లో ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించే సభలో పాల్గొంటారు.