News October 18, 2024

నిజామాబాద్: దసరా.. RTC ఆదాయం రూ.1.69 కోట్లు

image

దసరా సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రూ.1.69 కోట్ల ఆదాయం వచ్చినట్లు RTC RM జానిరెడ్డి తెలిపారు. ఈనెల 1-17 వరకు ఆర్మూర్, బోధన్, నిజామాబాద్, నిజామాబాద్ రూరల్, బాన్సువాడ, కామారెడ్డి డిపోల నుంచి ప్రత్యేక బుస్సులు నడిపినట్లు వెల్లడించారు. 6 డిపోల పరిధిలో ప్రతి ఒక్క ఉద్యోగి సమష్టిగా పనిచేయడంతో భారీ ఆదాయం వచ్చిందన్నారు.

Similar News

News November 2, 2025

NZB: 77 కిలోల వెండి చోరీ

image

నిజామాబాద్‌లోని వన్ టౌన్ పరిధిలో ఓ సిల్వర్ మర్చంట్ షాపులో 77 KGల వెండి చోరీ అయ్యింది. నగరానికి చెందిన ఇద్దరు సిల్వర్ మర్చంట్‌లో 6 నెలలుగా పని చేస్తున్నారు. వారు షాప్‌లో నుంచి వెండిని విడతల వారీగా చోరీ చేశారు. ఇటీవల వారిని షాప్ యజమాని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో 4 KGల వెండిని తిరిగి ఇచ్చినట్లు సమాచారం. మిగతా 73 KGల వెండి తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడు వన్ టౌన్‌లో ఫిర్యాదు చేశాడు.

News November 2, 2025

నిజామాబాద్: ఈ నెల 15న స్పెషల్ లోక్ అదాలత్

image

ప్రజల విసృత ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ ఈ నెల 15న కోర్టు ప్రాంగణాల్లో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఛైర్‌పర్సన్ జీవీఎన్ భారత లక్ష్మీ తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఆమె ఛాంబర్‌లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావుతో కలిసి విలేఖరులతో మాట్లాడారు.

News November 2, 2025

NZB: ఈ నెల 3 నుంచి కళాశాలలు బంద్

image

రాష్ట్ర అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 3వ తేదీ నుంచి NZB జిల్లాల్లోని అన్ని కళాశాలలను బంద్ పెడుతున్నామని తెలంగాణ యూనివర్సిటీ ప్రైవేట్ కళాశాలల యాజమాన్య అసోసియేషన్ సభ్యులు తెలిపారు. శనివారం TU రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరిని కలిసి బంద్‌కు సంబంధించిన వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాలల మనుగడ ప్రశ్నార్థకం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.