News October 18, 2024

రేపు భారత్, పాకిస్థాన్ మ్యాచ్

image

ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2024 టోర్నీ నేటి నుంచి ప్రారంభం కానుండగా, <<14354965>>ఇండియా-A<<>> తన తొలి మ్యాచులో రేపు పాక్‌-Aతో తలపడనుంది. ఒమన్ వేదికగా రేపు రా.7కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో భారత్, పాక్, శ్రీలంక, అఫ్గాన్, బంగ్లా జట్లు తమ A టీమ్‌లను బరిలోకి దింపగా, UAE, ఒమన్, హాంకాంగ్ తమ సీనియర్ జట్లను ఆడిస్తున్నాయి. ఈ మ్యాచులను ఫ్యాన్‌కోడ్ యాప్‌లో చూడవచ్చు.

Similar News

News October 18, 2024

సంచలనం.. ఇద్దరే 20 వికెట్లు కూల్చేశారు

image

రెండో టెస్టులో ENGపై పాకిస్థాన్ 152 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపులో స్పిన్నర్లు సాజిద్ ఖాన్, నోమన్ అలీ కీలక పాత్ర పోషించారు. రెండు ఇన్నింగ్సులూ కలిపి వీరిద్దరే 20 వికెట్లు కూల్చేశారు. టెస్టు క్రికెట్‌లో ఇలాంటి ఘనత సాధించిన ఏడో ద్వయంగా వీరు నిలిచారు. 52 ఏళ్లలో ఇదే తొలిసారి. నోమన్ 11(3+8), సాజిద్ 9(7+2) వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో వీరిద్దరే బౌలింగ్ చేయడం మరో విశేషం.

News October 18, 2024

రెండు ఖండాలను కలిపే బ్రిడ్జ్ గురించి తెలుసా?

image

రెండు గ్రామాల మధ్య బ్రిడ్జి ఉండటం కామన్. కానీ, 2 ఖండాలను కలిపే వంతెన గురించి మీకు తెలుసా? నార్త్ అమెరికా, యూరప్‌ ఖండాలను కలిపే ‘బ్రిడ్జ్ బిట్వీన్ కాంటినెంట్స్’ అనే ఫుట్ బ్రిడ్జి ఐస్‌లాండ్‌లో ఉంది. 50 అడుగుల పొడవైన ఈ బ్రిడ్జిని దాటితే గ్రీన్స్‌లాండ్స్‌‌పై అడుగుపెట్టొచ్చు. ఇక్కడ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈజీగా ఖండాన్ని దాటొచ్చు. భూమిపై ఏర్పడిన చీలికతో ఖండాన్ని విభజించిన గుర్తులు కనిపిస్తాయి.

News October 18, 2024

టాటా మాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయి: మూర్తి

image

రతన్ టాటాతో తనకున్న అనుబంధాన్ని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి గుర్తుచేసుకున్నారు. ‘టాటా నిరుపేదలు, ఉద్యోగుల గురించి ఎంతో ఆలోచిస్తారు. భారతీయులకు తక్కువ ధరకే కార్లను అందించాలనుకున్నారు. 1999లో నా కుమార్తెకు నాయకత్వ విలువలు, కఠిన నిర్ణయాలు ఎలా తీసుకోవాలనే అంశాలపై గంట క్లాస్ చెప్తానని 3 గంటలు తీసుకున్నారు. ఆయన మాటలు నాపైనా, నా కుటుంబంపైనా చిరస్థాయిగా నిలిచిపోతాయి’ అని అన్నారు.