News October 18, 2024

మంత్రి సురేఖపై కేటీఆర్ పరువు నష్టం కేసు.. విచారణ వాయిదా

image

TG: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు కేటీఆర్ సోమవారం నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు. మరోవైపు ఇవాళ సాయంత్రం మూసీపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మూసీ నది పునరుజ్జీవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులను వివరించనున్నారు.

Similar News

News October 18, 2024

రెండు ఖండాలను కలిపే బ్రిడ్జ్ గురించి తెలుసా?

image

రెండు గ్రామాల మధ్య బ్రిడ్జి ఉండటం కామన్. కానీ, 2 ఖండాలను కలిపే వంతెన గురించి మీకు తెలుసా? నార్త్ అమెరికా, యూరప్‌ ఖండాలను కలిపే ‘బ్రిడ్జ్ బిట్వీన్ కాంటినెంట్స్’ అనే ఫుట్ బ్రిడ్జి ఐస్‌లాండ్‌లో ఉంది. 50 అడుగుల పొడవైన ఈ బ్రిడ్జిని దాటితే గ్రీన్స్‌లాండ్స్‌‌పై అడుగుపెట్టొచ్చు. ఇక్కడ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈజీగా ఖండాన్ని దాటొచ్చు. భూమిపై ఏర్పడిన చీలికతో ఖండాన్ని విభజించిన గుర్తులు కనిపిస్తాయి.

News October 18, 2024

టాటా మాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయి: మూర్తి

image

రతన్ టాటాతో తనకున్న అనుబంధాన్ని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి గుర్తుచేసుకున్నారు. ‘టాటా నిరుపేదలు, ఉద్యోగుల గురించి ఎంతో ఆలోచిస్తారు. భారతీయులకు తక్కువ ధరకే కార్లను అందించాలనుకున్నారు. 1999లో నా కుమార్తెకు నాయకత్వ విలువలు, కఠిన నిర్ణయాలు ఎలా తీసుకోవాలనే అంశాలపై గంట క్లాస్ చెప్తానని 3 గంటలు తీసుకున్నారు. ఆయన మాటలు నాపైనా, నా కుటుంబంపైనా చిరస్థాయిగా నిలిచిపోతాయి’ అని అన్నారు.

News October 18, 2024

కాంగ్రెస్ IT సెల్‌కు ‘Head’ కష్టాలు!

image

కేరళ కాంగ్రెస్‌ IT సెల్‌లో విచిత్రమైన ట్రెండ్ కనిపిస్తోంది. హెడ్‌గా ఎవరొచ్చినా కొన్నాళ్లకు ప్రత్యర్థి పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. గుజరాత్ అల్లర్లలో మోదీ పాత్రపై BBC డాక్యుమెంటరీని కాంగ్రెస్ ఎండార్స్ చేసిందని AK ఆంటోనీ కొడుకు అనిల్ వెళ్లిపోయారు. BJP నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు. సివిల్ సర్వీసెస్ నుంచి పాలిటిక్స్‌లో జాయినైన Dr సరిన్ P తాజాగా CPMకు అనుకూలంగా మాట్లాడటంతో ఆయనపై వేటు పడింది.