News October 18, 2024
జగన్ రాక్షస పాలనను ప్రజలు మర్చిపోలేరు: మంత్రి అనగాని

AP: టీడీపీ కార్యాలయంపై దాడి జరిగి రేపటితో మూడేళ్లు పూర్తవుతుందని, తప్పుచేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. జగన్ రాక్షస పాలనను ప్రజలు మర్చిపోలేరన్నారు. దెబ్బతిన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడకూడదన్నదే ఆయన ఉద్దేశమని పేర్కొన్నారు.
Similar News
News January 31, 2026
ఈ సెషన్లోనే పార్లమెంట్కు అమరావతి బిల్లు?

AP: రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే కేంద్ర హోంశాఖ నుంచి క్లియరెన్స్ లభించింది. ఇప్పుడు న్యాయశాఖ, పట్టణాభివృద్ధి వంటి 4 కేంద్ర శాఖల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. కేంద్ర క్యాబినెట్ ఆమోదించాక బిల్లును ఈ పార్లమెంట్ సెషన్లోనే ప్రవేశ పెట్టడానికి కూటమి MPలు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఆ బిల్లుపై YCP ఏ స్టాండ్ తీసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.
News January 31, 2026
‘నో డ్యూ’తో మొండి బకాయిలు వసూలు!

TG: మున్సిపల్ ఎన్నికలతో ఇన్నాళ్ల మొండి బకాయిలు వసూలవుతున్నాయి. ఎలక్షన్స్లో పోటీ చేసే అభ్యర్థులకు ‘నో డ్యూ’ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో వారంతా పెండింగ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు. నిజామాబాద్ 19వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి శమంతనరేందర్ తమ వంశీ హోటల్కు సంబంధించి ఏకంగా రూ.7.50కోట్ల ఆస్తిపన్ను కట్టారు. అన్ని మున్సిపాలిటీల్లో కలిపి రూ.50 కోట్లకు పైగా పన్నులు వసూలైనట్లు అధికారులు తెలిపారు.
News January 31, 2026
జుట్టు ఎందుకు రాలుతుందంటే?

మనిషి శరీరంలో ఉండే ఇమ్యూనిటీ సెల్ అలోప్సియా అరెటా జుట్టు రాలడానికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కొరియా అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. అలోప్సియా అరెటా అనేది జుట్టుకు సంబంధించిన ఒక వ్యాధి. ఇది జుట్టు కుదుళ్లను బలహీనపరిచి జుట్టును ఎక్కువగా రాలిపోయేలా చేస్తుందని వారు తెలిపారు. ఇది ఇమ్యునిటీ తగ్గడం వల్ల కూడా జరుగుతుందని అన్నారు.


