News October 18, 2024
విషాదం.. సెలవుల తర్వాత స్కూలుకు వెళ్లిన రోజే..

AP: దసరా సెలవుల తర్వాత పాఠశాలకు వెళ్లిన కాసేపట్లోనే బాలిక ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్లో లావణ్య (12) ఏడో తరగతి చదువుతోంది. సెలవుల తర్వాత నిన్న తల్లి స్కూలుకు తీసుకెళ్లింది. తోటి విద్యార్థులెవరూ ఇంకా రాలేదని, రేపు వద్దాం అమ్మా అని లావణ్య చెప్పగా.. తల్లి సర్ది చెప్పింది. తల్లి ఇంటికి బయల్దేరిన కాసేపటికే లావణ్య తన గదిలో ఉరేసుకుంది.
Similar News
News November 4, 2025
122 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<
News November 4, 2025
మంత్రి అజహరుద్దీన్కు శాఖల కేటాయింపు

TG: ఇటీవల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజహరుద్దీన్కు ప్రభుత్వం శాఖలు కేటాయించింది. ఆయనకు ప్రభుత్వ రంగ సంస్థలు (పబ్లిక్ ఎంటర్ప్రైజెస్), మైనారిటీ వెల్ఫేర్ శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కాగా ఆయనకు హోంశాఖ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ శాఖను సీఎం రేవంత్ అజహరుద్దీన్కు ఇవ్వలేదు.
News November 4, 2025
రేపు వరల్డ్ కప్ విజేతలకు PM ఆతిథ్యం

ICC ఉమెన్ వరల్డ్ కప్-2025 కైవసం చేసుకున్న భారత క్రికెటర్ల బృందానికి ప్రధాని నరేంద్ర మోదీ రేపు(NOV 5న) ఆతిథ్యం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ఆహ్వానాన్ని PMO బీసీసీఐకి పంపింది. ఈరోజు సాయంత్రం హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో క్రికెటర్లు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆదివారం ఉత్కంఠగా జరిగిన పైనల్లో టీమ్ ఇండియా సౌత్ ఆఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి చిరకాల స్వప్నం వరల్డ్ కప్ను సాధించడం తెలిసిందే.


