News October 18, 2024
Health Risk: నిలబడి పనిచేస్తున్నారా!
శారీరక శ్రమ లేదని ఆఫీసుల్లో స్టాండింగ్ డెస్కులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు వీటితోనూ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని రీసెర్చర్స్ అంటున్నారు. రోజుకు 2Hrs పైగా నిలబడి పనిచేస్తే వెరికోస్ వీన్స్, నరాల్లో రక్తప్రసరణ తగ్గే జబ్బులు వస్తున్నాయని హెచ్చరించారు. అందుకే మరీ ఎక్కువగా కూర్చోకుండా, నిలబడకుండా ఇంటర్వల్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒంటి కాలిమీద బరువు పెట్టొద్దని, పోస్చర్ మార్చుకోవాలని అంటున్నారు.
Similar News
News October 18, 2024
కొత్త అవతారంలో రాహుల్ చౌదరి
తెలుగు టైటాన్స్ మాజీ కెప్టెన్, కబడ్డీ స్టార్ ప్లేయర్ రాహుల్ చౌదరి ప్రొకబడ్డీకి వీడ్కోలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ్టి నుంచి సీజన్ ప్రారంభం కానుండగా రాహుల్ కొత్త అవతారంలో కనిపించారు. కబడ్డీ అనలిస్ట్గా, హ్యాండ్సమ్ లుక్లో ఆయన దర్శనమిచ్చారు. 31 ఏళ్ల రాహుల్ చౌదరిని ఈ సారి వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనేందుకు ఆసక్తి చూపించలేదు.
News October 18, 2024
ఇసుకపై సీనరేజ్ ఛార్జ్ వసూళ్లు ఎత్తివేస్తున్నాం: చంద్రబాబు
AP: ఉచిత ఇసుకపై సీఎం చంద్రబాబు మరో కీలక ప్రకటన చేశారు. సీనరేజ్ ఛార్జ్ వసూళ్లు కూడా ఎత్తివేస్తున్నట్లు చెప్పారు. లారీల్లో 40 టన్నులకు మించి ఉన్నా అధిక లోడ్ జరిమానాలు ఉండవని స్పష్టం చేశారు. టీడీపీ ప్రజాప్రతినిధుల భేటీలో సీఎం ఈమేరకు ప్రకటించారు. కాగా ఇప్పటికే రీచ్ల నుంచి ట్రాక్టర్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఇవాళ సాయంత్రం <<14392031>>అనుమతి<<>> ఇచ్చింది.
News October 18, 2024
పాక్ రండి.. మ్యాచ్ ఆడగానే వెళ్లిపోండి: PCB
తమ దేశంలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనేలా చేయడానికి PCB శతవిధాలా ప్రయత్నిస్తోంది. తాజాగా BCCI ముందు కొత్త ప్రతిపాదన పెట్టింది. పాక్లో ఉండటానికి భద్రతాపరమైన కారణాలు అడ్డొస్తున్నాయనుకుంటే IND ఆడే ప్రతి మ్యాచ్ తర్వాత తిరిగి చండీగఢ్ లేదా ఢిల్లీకి వెళ్లిపోవచ్చని చెప్పినట్లు cricbuzz తెలిపింది. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ పాక్ వెళ్లేది లేదని అంటున్న BCCI, PCB ప్రతిపాదనపై ఎలా స్పందిస్తుందో?