News October 18, 2024

గ్రూప్-1కు లైన్ క్లియర్

image

TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఈ నెల 21 నుంచి జరిగే పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థులకు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో చుక్కెదురైంది. వాళ్లు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. పరీక్షల నిర్వహణపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. అటు సుప్రీంకోర్టులో దీనిపై విచారణ ఉండటంతో అక్కడ తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు.

Similar News

News November 6, 2025

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: ద్రోణి ప్రభావంతో రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కోనసీమ, పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది. పిడుగులు పడే ఛాన్స్ ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

News November 6, 2025

WPL-2026.. రిటైన్ లిస్టు ఇదే..

image

WPL-2026 ఎడిషన్ కోసం ఢిల్లీలో ఈనెల 27న వేలం జరగనుంది. దీనికి ముందు 5 జట్లు పలువురు ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి. ఆ జాబితా ఇదే..
RCB: స్మృతి మంధాన(3.5Cr), రిచా ఘోష్(2.75Cr), పెర్రీ(2Cr), శ్రేయాంక(60L)
MI: హర్మన్‌ప్రీత్, బ్రంట్‌, హేలీ, అమన్‌జోత్, కమలిని
DC: జెమీమా, షఫాలీ, అన్నాబెల్, మారిజాన్, నికి ప్రసాద్
UP వారియర్స్: శ్వేతా సెహ్రావత్
గుజరాత్: ఆష్లీ గార్డ్‌నర్, బెత్ మూనీ

News November 6, 2025

వరల్డ్ క్లాస్ బ్యాంకుల కోసం చర్చలు: నిర్మల

image

భారత్‌కు అతిపెద్ద, వరల్డ్ క్లాస్ బ్యాంకుల అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆ దిశగా ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టిందన్నారు. ఆర్బీఐతోపాటు బ్యాంకులతోనూ చర్చిస్తున్నామని ముంబైలో జరిగిన 12th SBI బ్యాంకింగ్&ఎకనామిక్స్ కాంక్లేవ్‌లో తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టిసారించామని, పదేళ్లలో మూలధన వ్యయం 5 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు.