News October 18, 2024

ఆ రికార్డులో రెండో స్థానానికి కోహ్లీ

image

టెస్టుల్లో విరాట్ కోహ్లీ 9వేల పరుగుల్ని పూర్తి చేసుకున్నారు. బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆయన హాఫ్ సెంచరీ దాటారు. ఈక్రమంలో ఈ ఘనత అందుకున్నారు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన క్రికెటర్లలో రెండో స్థానంలో ఆయన కొనసాగుతున్నారు. 596 ఇన్నింగ్స్‌లలో ఆయన 221 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేశారు. ఈ జాబితాలో సచిన్(264) అగ్రస్థానంలో ఉన్నారు.

Similar News

News October 18, 2024

గ్రూప్-1 ఇష్యూ.. జీవో 55, జీవో 29 ఏంటి?

image

TG:GO-55 ప్రకారం 1 JOBకి రిజర్వేషన్ సహా అన్ని కేటగిరీల నుంచి 50 మందిని సెలక్ట్ చేస్తారు. మిగతా రిజర్వుడ్ పోస్టులకు ఆయా అభ్యర్థులనే ఎంచుకుంటారు. రిజర్వుడ్ అభ్యర్థులకు వారి కోటా, ఓపెన్‌లోనూ ఛాన్సుంటుంది. GO 29 ప్రకారం ఓపెన్‌లో రిజర్వుడ్ అభ్యర్థులకు ఛాన్సుండదు. టాప్ మార్కులు వచ్చినా రిజర్వేషన్‌లోనే పరిగణించడంతో మరో రిజర్వుడ్ అభ్యర్థికి ఛాన్స్ ఉండదు. దీంతో GO 29 రద్దు చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.

News October 18, 2024

గ్రూప్-1 అభ్యర్థులకు KTR భరోసా

image

TG: గ్రూప్-1 అభ్యర్థులపై లాఠీఛార్జ్ చేయడాన్ని మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. సీఎం ఆదేశాలతో నిరుద్యోగులపై పోలీసులు జులుం చూపించారని మండిపడ్డారు. నిరుద్యోగులపై ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించరని పేర్కొన్నారు. గ్రూప్-1 అభ్యర్థులకు BRS అండగా ఉంటుందని KTR భరోసా ఇచ్చారు. అటు అరెస్ట్ చేసిన అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

News October 18, 2024

డెన్మార్క్ ఓపెన్‌లో సింధు ఓటమి

image

డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు ప్రస్థానం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. ఇండోనేషియా ప్లేయర్ గ్రెగోరియా టుంజుంగ్ చేతిలో 13-21, 21-16, 9-21 తేడాతో ఆమె పరాజయంపాలయ్యారు. ఆమె ఓటమితో ఈ టోర్నీ నుంచి భారత్ రిక్త హస్తాలతో వెనుదిరిగింది. మిగిలిన అన్ని విభాగాల్లోనూ భారత ప్లేయర్లు ముందే ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే.