News October 18, 2024
లోన్లపై RBI నిషేధం: ఫిన్టెక్ ఇండస్ట్రీలో ప్రకంపనలు
నావి ఫిన్సర్వ్తో పాటు 3 NBFCs లోన్లు ఇవ్వకుండా RBI నిషేధం విధించడం ఫిన్టెక్ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపింది. గ్రోత్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడాలన్న మైండ్సెట్టే వేటుకు కారణమని విశ్లేషకులు అంటున్నారు. రూల్స్ పాటించకపోవడం, ఇష్టారీతిన ఎక్కువ వడ్డీకి రుణాలివ్వడం, ఫెయిర్ ప్రాక్టీస్ కోడ్, రుణ గ్రహీతల ఆర్థిక స్తోమత పట్టించుకోకపోవడం, ప్రాపర్గా లేని ఇన్కం అసెస్మెంట్లను RBI సీరియస్గా తీసుకుంది.
Similar News
News October 18, 2024
CM రేవంత్ విజన్కు దోహదపడటం ఓ గౌరవం: అదానీ
యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ విషయంలో TG CM రేవంత్ రెడ్డి దార్శనికతకు, నాయకత్వానికి దోహదపడటాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నామని గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు. ‘మన యువత భవిష్యత్తును తీర్చిదిద్దడమే కాక మరింత సుసంపన్నమైన భారత్ను సృష్టించేందుకు అవసరమైన సామర్థ్యాల్ని మేం వెలికి తీస్తున్నాం. తరతరాలను ఉద్ధరించనున్నాం’ అని పేర్కొన్నారు. వర్సిటీ ఏర్పాటుకోసం ఆయన సీఎం రేవంత్కి రూ.100 కోట్ల చెక్కు అందించారు.
News October 18, 2024
గ్రూప్-1 ఇష్యూ.. జీవో 55, జీవో 29 ఏంటి?
TG:GO-55 ప్రకారం 1 JOBకి రిజర్వేషన్ సహా అన్ని కేటగిరీల నుంచి 50 మందిని సెలక్ట్ చేస్తారు. మిగతా రిజర్వుడ్ పోస్టులకు ఆయా అభ్యర్థులనే ఎంచుకుంటారు. రిజర్వుడ్ అభ్యర్థులకు వారి కోటా, ఓపెన్లోనూ ఛాన్సుంటుంది. GO 29 ప్రకారం ఓపెన్లో రిజర్వుడ్ అభ్యర్థులకు ఛాన్సుండదు. టాప్ మార్కులు వచ్చినా రిజర్వేషన్లోనే పరిగణించడంతో మరో రిజర్వుడ్ అభ్యర్థికి ఛాన్స్ ఉండదు. దీంతో GO 29 రద్దు చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.
News October 18, 2024
గ్రూప్-1 అభ్యర్థులకు KTR భరోసా
TG: గ్రూప్-1 అభ్యర్థులపై లాఠీఛార్జ్ చేయడాన్ని మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. సీఎం ఆదేశాలతో నిరుద్యోగులపై పోలీసులు జులుం చూపించారని మండిపడ్డారు. నిరుద్యోగులపై ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించరని పేర్కొన్నారు. గ్రూప్-1 అభ్యర్థులకు BRS అండగా ఉంటుందని KTR భరోసా ఇచ్చారు. అటు అరెస్ట్ చేసిన అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.