News October 18, 2024
తప్పుడు రాతలు రాస్తే వదిలిపెట్టేది లేదు: లోకేశ్

ఇప్పటికైనా సాక్షి దినపత్రిక తన వైఖరిని మార్చుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హితువు పలికారు. విశాఖ కోర్టులో హాజరైన అనంతరం మాట్లాడుతూ.. తప్పుడు రాతలు రాస్తూ దుష్ప్రచారం చేస్తే ప్రభుత్వం, టీడీపీ, పార్టీ నాయకులు వదిలిపెట్టరని హెచ్చరించారు. 2019-2024 వరకు ఆ పత్రిక రాసిన అనేక అవాస్తవాలు, తప్పుడు రాతలను రుజువు చేయలేకపోయిందని అన్నారు.అందుకనే వైసీపీని ప్రజలు తిరస్కరించినట్లు పేర్కొన్నారు.
Similar News
News January 17, 2026
KGHలో ఆన్లైన్ వైద్య సేవలు

ఇకపై KGHలో గంటల తరబడి ఓపీ, ఇతర వైద్య పరీక్షల కోసం వేచిచూడాల్సిన అవసరం లేదు. ఈ సమస్యలకు చెక్ పెట్టే దిశగా ఈ-పాలన విధానాన్ని KGH అమలు చేయనుంది. రోగులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వైద్య సేవలను ఆన్లైన్ విధానంలో అందించడమే లక్ష్యంగా ఈ కొత్త వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు KGH అధికారులు తెలిపారు.
News January 17, 2026
విశాఖ: రాజు గారి ఆవేదన వెనుక కారణం ఇదేనా?

విశాఖ MLA విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వీటి వెనుక రాజకీయాలకన్నా టిడ్కో ఇళ్లకు సంబంధించిన పెండింగ్ బకాయిల అంశమే ప్రధాన కారణమన్న చర్చ సాగుతోంది. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన బిల్లుల రూపంలో విష్ణు కుటుంబానికి సుమారు రూ.120 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నట్టు సమాచారం. కూటమి ప్రభుత్వం టిడ్కో బకాయిల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.
News January 16, 2026
విశాఖ: 26 ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు

సంక్రాంతి పండుగల నేపథ్యంలో ఉప రవాణా కమిషనర్ ఆర్సీహెచ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు 2 రోజులుగా విశాఖలో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు,ర వాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని 26 ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేసి రూ.52,000 జరిమానాలు విధించారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలు కొనసాగుతాయన్నారు.


