News October 18, 2024
ఉచితంగా ఇసుక తీసుకెళ్లొచ్చు: ప్రభుత్వం
AP: రీచ్ల నుంచి ట్రాక్టర్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం, స్థానిక అవసరాలకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళ్లవచ్చని పేర్కొంది. గతంలో రీచ్ల నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు ఎడ్లబండ్లకు మాత్రమే అనుమతి ఉండగా, తాజాగా ట్రాక్టర్లకూ వర్తింపచేసింది. పలుచోట్ల ట్రాక్టర్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తుండటంతో ప్రభుత్వం తాజాగా GO ఇచ్చింది.
Similar News
News October 19, 2024
నేటి ముఖ్యాంశాలు
* TG: స్కిల్ వర్సిటీ ఏర్పాటుకు రూ.100 కోట్ల విరాళం ఇచ్చిన అదానీ
* మూసీని మురికికూపంగా మార్చిందే కాంగ్రెస్, టీడీపీ: కేటీఆర్
* సీఎం రేవంత్తో చర్చకు సిద్ధమన్న హరీశ్ రావు
* AP: ఇసుక, లిక్కర్ వ్యాపారంలో జోక్యం చేసుకోవద్దని టీడీపీ నేతలకు CBN వార్నింగ్
* మద్యం టెండర్లలో భారీ కుంభకోణాలు: జగన్
* 100 రోజుల్లో విశాఖలో TCS శంకుస్థాపన: లోకేశ్
* NZతో టెస్టు: 125 పరుగుల వెనుకంజలో భారత్
News October 19, 2024
అల్పపీడనం.. 24న వాయుగుండంగా మారే ఛాన్స్
AP: ఈనెల 22న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనంపై రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అప్డేట్ ఇచ్చింది. అల్పపీడనం వాయవ్య దిశగా కదిలి 24న వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత అది ఎటు పయనిస్తుందనే విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉందని వెల్లడించింది. దీనిపై ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది.
News October 19, 2024
ఫైనల్కు దూసుకెళ్లిన న్యూజిలాండ్
టీ20 మహిళల వరల్డ్ కప్లో న్యూజిలాండ్ ఫైనల్కు దూసుకెళ్లింది. వెస్టిండీస్తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఆ జట్టు 8 పరుగుల తేడాతో గెలిచింది. 129 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన విండీస్ 120/8కే పరిమితమైంది. ఆ జట్టులో డాటిన్ (33) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. కివీస్ బౌలర్లలో కార్సన్ 3, కెర్ 2 వికెట్లు తీశారు. ఎల్లుండి దుబాయ్లో జరిగే ఫైనల్లో సౌతాఫ్రికాతో న్యూజిలాండ్ తలపడనుంది.