News October 18, 2024
బోణి కొట్టిన తెలుగు టైటాన్స్
ప్రోకబడ్డీ లీగ్ 11వ సీజన్ తొలి మ్యాచ్లో తెలుగు టైటాన్స్ బోణీ కొట్టింది. బెంగళూరు బుల్స్తో జరిగిన మ్యాచులో 37-29 పాయింట్ల తేడాతో గెలుపొందింది. తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ షెరావత్ 13 పాయింట్లు రాబట్టడం గమనార్హం. ప్రో కబడ్డీ లీగ్లో పవన్ రికార్డు స్థాయిలో 1,200 పాయింట్లు సాధించారు. మరోవైపు రేపు రాత్రి 8 గంటలకు తమిళ్ తలైవాస్తో టైటాన్స్ రెండో మ్యాచ్ ఆడనుంది.
Similar News
News October 19, 2024
T20 WC FINAL: ఎవరు గెలిచినా చరిత్రే
టీ20 వుమెన్స్ వరల్డ్ కప్లో రేపు దుబాయ్లో జరగబోయే ఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ రెండు జట్లూ ఇంతవరకూ ఏ ఐసీసీ ట్రోఫీ సాధించలేదు. దీంతో ఈ మ్యాచ్లో ఎవరు గెలిచినా తొలిసారి ట్రోఫీ సాధించి హిస్టరీ క్రియేట్ చేయనున్నారు. కాగా పురుషుల విభాగంలో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు కూడా ఎప్పుడూ ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీలు సాధించని విషయం తెలిసిందే.
News October 19, 2024
యుద్ధం ముగిసే వరకు బందీలను వదలం: హమాస్
యుద్ధానికి ముగింపు పలికే వరకు ఇజ్రాయెల్ బందీలను వదిలే ప్రసక్తే లేదని హమాస్ తేల్చి చెప్పింది. తమ ప్రాంతంపై దాడులు ఆపి, భద్రతా దళాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. పాలస్తీనా కోసం యాహ్యా సిన్వర్ చివరి వరకు పోరాడి, ప్రాణాలు అర్పించారని తెలిపింది. మరోవైపు హమాస్ తమ బందీలను వదిలి, ఆయుధాలను పక్కనబెట్టిన మరుక్షణమే యుద్ధం ముగిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
News October 19, 2024
ఈ భారత జట్టుకు పోరాడే లక్షణం ఎక్కువ: మంజ్రేకర్
బెంగళూరు టెస్టు విషయంలో న్యూజిలాండ్ను మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ హెచ్చరించారు. భారత జట్టుపై గెలవడం అంత సులువు కాదని తేల్చిచెప్పారు. ‘ఇప్పుడున్న భారత జట్టుకు పోరాడే లక్షణం ఎక్కువ. నేను న్యూజిలాండ్ ఆటగాడినైతే కచ్చితంగా టీమ్ ఇండియాను చూసి భయపడతా. వరల్డ్ కప్ టీ20 ఫైనల్స్లో సౌతాఫ్రికాకు 30 బంతుల్లో 30 పరుగులే కావాలి. అయినా సరే భారత్ ఎలా గెలిచిందో చూశాం కదా’ అని ట్వీట్ చేశారు.