News October 19, 2024

గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో ఎస్టీ కమిషన్ ఛైర్మన్ భేటీ

image

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డీవీజీ శంకర్రావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. క్షేత్ర స్థాయిలో జరిపిన పర్యటనల్లో గిరిజనుల సమస్యలను అధ్యయనం చేసి, కమిషన్ సిఫార్సులను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారన్నారు. ఏకలవ్య పాఠశాలల్లో భాషోపాధ్యాయుల సమస్య, గిరిజన ప్రాంతాలకు రవాణా సౌకర్యాల కల్పనపై అభ్యర్థించారన్నారు. గిరిజనుల సంక్షేమానికి క్షేత్ర స్థాయి సర్వే చేయాలని కోరారన్నారు.

Similar News

News November 8, 2025

యాక్సిడెంట్.. ఇద్దరికి గాయాలు

image

విజయనగరం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీ బస్సు జమ్ము నారాయణపురం గ్రామం వద్ద ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా బైక్ నుజ్జునుజ్జు అయింది. గాయపడిన ఇద్దరిని 108లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారు విజయనగరంలోని దాసన్నపేటకు చెందిన వారని స్థానికులు తెలిపారు.

News November 8, 2025

వసతి గృహంలో విద్యార్థులతో కలిసి ఎంపీ కలిశెట్టి రాత్రి బస

image

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన పుట్టిన రోజును శుక్రవారం పూసపాటిరేగ మండలం కొప్పెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి సాదాసీదాగా జరుపుకున్నారు. విద్యార్థులకు స్వయంగా వడ్డించి వారితో కలిసి భోజనం చేసిన ఎంపీ.. రాత్రి కూడా అక్కడే విద్యార్థుల మధ్య బస చేశారు. తన జన్మదిన వేడుకలు విద్యార్థుల మధ్య జరుపుకోవడం సంతృప్తినిచ్చిందని ఎంపీ పేర్కొన్నారు.

News November 8, 2025

జాతీయస్థాయి పోటీలకు కొత్తవలస విద్యార్థిని

image

డిసెంబర్‌లో జరగనున్న జాతీయస్థాయి అండర్-19 మహిళా క్రికెట్ పోటీలకు కొత్తవలస ZPHS విద్యార్థిని పుష్పిత గౌడ కుమార్ ఎంపికైనట్లు HM ఈశ్వరరావు తెలిపారు. గురు, శుక్రవారాల్లో శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో విజయనగరం జిల్లా జట్టు తరుఫున ఆడి 3వ స్థానం సాధించింది. దీంతో ఏపీ రాష్ట్ర మహిళా క్రికెట్ టీమ్‌కు వైస్ కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చినట్లు పీడీ బంగారు పాప తెలిపారు.