News October 19, 2024

పాకిస్థాన్ కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్?

image

పాకిస్థాన్ వన్డే, టీ20 జట్టు కెప్టెన్‌గా వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌ను నియమించాలని పీసీబీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్‌తో పీసీబీ ఛైర్మన్ నఖ్వీ చర్చించినట్లు సమాచారం. ఈ నెల 28న రిజ్వాన్ పేరును పీసీబీ అధికారికంగా ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టేందుకు బాబర్ ఆజమ్ కెప్టెన్సీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Similar News

News October 19, 2024

ఇంటర్ అమ్మాయి దారుణ హత్య

image

AP: ప్రేమోన్మాది చేతిలో మరో యువతి బలైంది. కర్నూలు(D) నగరూరుకు చెందిన అశ్విని పత్తికొండ మోడల్ స్కూల్‌లో ఇంటర్ చదువుతోంది. దసరా సెలవులకు ఇంటికి రాగా అదే గ్రామానికి చెందిన సన్నీ ఎవరూలేని సమయం చూసి ఆమె ఇంటికి వెళ్లాడు. తనను ప్రేమించాలని బెదిరించాడు. యువతి నిరాకరించడంతో పురుగుమందు ఆమె నోట్లో పోసి పరారయ్యాడు. పేరెంట్స్ వచ్చి చూడగా అశ్విని చావుబతుకుల్లో కనిపించింది. ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయింది.

News October 19, 2024

న్యాయం కోసం 312 గంటలుగా జూడాల పోరాటం!

image

కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ జూ.డాక్టర్లు చేస్తోన్న నిరాహార దీక్ష 14 రోజులకు చేరుకుంది. వీరికి AIIMS వైద్యులు మద్దతుగా నిలిచారు. ‘మిత్రులారా యువ వైద్యురాలికి న్యాయం చేయాలని 312 గంటలుగా వీరు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. రోజుల తరబడి ఆహారం తీసుకోకుండా వైద్య సోదరుల భద్రత, గౌరవం కోసం పోరాడుతున్నారు. మీరు విశ్రాంతి తీసుకునే ముందు వీరి గురించి ఆలోచించండి’ అని కోరుతున్నారు.

News October 19, 2024

కండక్టర్లకు ఓడీ డ్యూటీలు విరమించుకున్న యాజమాన్యం

image

TG: ఆర్టీసీలో బస్సు కండక్టర్ల కొరత దృష్ట్యా యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డిపోలు, యూనిట్లలో ఓడీ(అవుట్ ఆఫ్ డిజిగ్నేషన్) డ్యూటీలను విరమించుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. కొంత కాలంగా కొందరు కండక్టర్లు డిపోలు, యూనిట్లలో సెక్యూరిటీ డ్యూటీలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారిని ఆ విధుల నుంచి తప్పించాలని జిల్లాల ఆర్టీసీ అధికారులను యాజమాన్యం ఆదేశించింది.