News October 19, 2024
నొప్పిని తట్టుకునేందుకు స్త్రీపురుషుల్లో వేర్వేరు వ్యవస్థలు

నొప్పిని తట్టుకునే వ్యవస్థల్లో స్త్రీలకు, పురుషులకు మధ్య తేడా ఉంటుందని US పరిశోధకులు తెలిపారు. దీర్ఘకాలిక వెన్ను నొప్పిపై అధ్యయనంలో ఈ విషయాన్ని గుర్తించామని పేర్కొన్నారు. నొప్పిని తట్టుకునేందుకు పురుషుల శరీరంలో ఎండోజీనస్ ఓపియాయిడ్స్, స్త్రీలలో నాన్-ఓపియాయిడ్స్ విడుదలవుతాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో నొప్పి చికిత్స కూడా స్త్రీ, పురుషులకు వేర్వేరుగా ఇవ్వాలని వారు స్పష్టం చేశారు.
Similar News
News March 14, 2025
రన్యా రావుకు బెయిల్ నిరాకరణ

<<15652905>>బంగారం స్మగ్లింగ్ కేసులో <<>>అరెస్టైన కన్నడ నటి రన్యారావు బెయిల్ పిటిషన్ను బెంగళూరు ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఆమెపై నమోదైన కేసులు చాలా తీవ్రమైనవంటూ DRI న్యాయవాది చేసిన వాదనలతో ఏకీభవించింది. ఈ కేసులో పలువురు బడాబాబులు ఆమె వెనుక ఉన్నారన్న అనుమానాలున్నాయి. దీంతో రన్యా ఎవరి పేరు చెబుతారోనని బ్యూరోక్రాట్లు, బడా రాజకీయ నేతల్లో గుబులు నెలకొన్నట్లు కర్ణాటక రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
News March 14, 2025
‘కౌన్ బనేగా కరోడ్పతి’ వదిలేస్తున్నారా? బచ్చన్ ఏమన్నారంటే..

టీవీ షో ‘కౌన్ బనేగా కరోడ్పతి’ని అమితాబ్ బచ్చన్ వదిలేస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం నడుస్తోంది. దానిపై 16వ సీజన్ చివరి ఎపిసోడ్లో బచ్చన్ క్లారిటీ ఇచ్చేశారు. ‘హోస్ట్గా ఆడియన్స్ నుంచి నాకు చాలా మద్దతు లభించింది. వచ్చే సీజన్లో మిమ్మల్ని మళ్లీ కలుస్తాను. మీ కష్టాన్ని నమ్ముకోండి. కలల్ని సజీవంగా ఉంచుకోండి’ అని ముగించారు. మళ్లీ బచ్చనే ఉంటారని తెలియడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.
News March 14, 2025
ప్రభుత్వ పోటీ పరీక్షలన్నీ మరాఠీలోనే: ఫడణవీస్

మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(MPSC) పరీక్షలన్నింటినీ మరాఠీలోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర CM ఫడణవీస్ ప్రకటించారు. ‘ఇంజినీరింగ్ కోర్సులు సహా అన్ని సాంకేతిక సబ్జెక్టులూ మరాఠీలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. MPSC పరీక్షల మరాఠీ నిర్వహణ విషయంలో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం’ అని శాసనమండలిలో తెలిపారు. ఇంగ్లిష్ మాట్లాడలేని విద్యార్థుల కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.