News October 19, 2024
జనసేనతో క్షేత్రస్థాయిలో సమస్యలు.. చంద్రబాబుతో ఎమ్మెల్యేలు
AP: TDP ప్రజాప్రతినిధులతో CM చంద్రబాబు సమావేశంలో పలువురు MLAలు జనసేన తీరుపై ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో జనసేనతో సమస్యలు వస్తున్నాయని, ఆ పార్టీ నేతలు సహకరించడం లేదని గౌతు శిరీషతోపాటు ముగ్గురు MLAలు ప్రస్తావించారు. అలాంటి సమస్యలను TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, జనసేన నేతలతో ఏర్పాటు చేసిన కమిటీ పరిష్కరిస్తుందని CM చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.
Similar News
News October 19, 2024
తక్కువ ధరలకే వంటనూనెలు: మంత్రి నాదెండ్ల
AP: రాష్ట్రంలోని ప్రజలకు తక్కువ ధరలకే వంట నూనెలను అందించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పామాయిల్ లీటర్ రూ.110, సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ రూ.124కే ఇస్తామని చెప్పారు. అలాగే తక్కువ ధరకే కందిపప్పు కూడా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి విజయవాడలో వంటనూనెల దిగుమతిదారులతో మంత్రి భేటీ అయ్యారు. మరింత ఎక్కువగా వంటనూనెలను అందుబాటులో ఉంచాలని వారిని ఆదేశించారు.
News October 19, 2024
కేటీఆర్ను కలిసిన గ్రూప్-4 అభ్యర్థులు
TG: గ్రూప్-4 ఉద్యోగాలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయి దాదాపు 2 నెలలు కావొస్తున్నా ఇంకా తుది జాబితాను ప్రకటించకపోవడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై తమకు మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ను కలిశారు. ఎలాంటి బ్యాక్ లాగ్ పోస్టులు మిగలకుండా భర్తీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయనను కోరారు. సానుకూలంగా స్పందించిన KTR దీనిపై ఉద్యమిస్తామని వారికి హామీ ఇచ్చారు.
News October 19, 2024
రష్యా-ఉక్రెయిన్ మధ్య 190 మంది ఖైదీల మార్పిడి
రెండేళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ వార్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. UAE మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు 190 మంది(చెరో 95 మంది) యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకున్నాయి. ఈ విషయాన్ని రష్యన్ రక్షణ శాఖ ధ్రువీకరించగా, కీవ్ ఇంకా స్పందించలేదు. గత నెలలో జరిగిన డీల్లో 206 మంది స్వదేశాలకు చేరుకున్నారు. అలాగే గత శుక్రవారం 501 మృతదేహాలను ఉక్రెయిన్, 89 బాడీలను రష్యా మార్పిడి చేసుకున్నాయి.