News October 19, 2024
కండక్టర్లకు ఓడీ డ్యూటీలు విరమించుకున్న యాజమాన్యం

TG: ఆర్టీసీలో బస్సు కండక్టర్ల కొరత దృష్ట్యా యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డిపోలు, యూనిట్లలో ఓడీ(అవుట్ ఆఫ్ డిజిగ్నేషన్) డ్యూటీలను విరమించుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. కొంత కాలంగా కొందరు కండక్టర్లు డిపోలు, యూనిట్లలో సెక్యూరిటీ డ్యూటీలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారిని ఆ విధుల నుంచి తప్పించాలని జిల్లాల ఆర్టీసీ అధికారులను యాజమాన్యం ఆదేశించింది.
Similar News
News September 15, 2025
ఆక్వా రంగాన్ని ఆదుకోవాలి: CM చంద్రబాబు

AP: నష్టాల్లో కూరుకుపోయిన ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని కేంద్ర ఆర్థిక, వాణిజ్య, మత్స్యశాఖల మంత్రులకు CM చంద్రబాబు లేఖలు రాశారు. ‘US టారిఫ్స్తో ఆక్వా రంగానికి రూ.25 వేల కోట్ల నష్టం జరిగింది. 50 శాతం ఆర్డర్లు రద్దయ్యాయి. ఆక్వా రైతులు నష్టపోకుండా కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఆక్వా ఉత్పత్తుల రవాణాకు డెడికేటెడ్ రైళ్లు నడపాలి. ఆక్వా రుణాల వడ్డీలపై మారటోరియం విధించాలి’ అంటూ సీఎం విజ్ఞప్తి చేశారు.
News September 15, 2025
నేడు స్థానిక ఎన్నికలపై సీఎం సమావేశం

TG: స్థానిక సంస్థల ఎన్నికలపై ఇవాళ సీఎం రేవంత్ మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సీతక్క, పొంగులేటి, పొన్నం, ఉత్తమ్ పాల్గొననున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అటు హైకోర్టు గడువు ఈ నెలాఖరుతో ముగియనున్నందున ప్రభుత్వం అప్పీల్కు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
News September 15, 2025
పవర్గ్రిడ్లో 866 అప్రంటిస్లు.. AP, TGలో ఎన్నంటే?

పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 866 అప్రంటిస్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రికల్, సివిల్, రాజ్భాష, ఎగ్జిక్యూటివ్ లా విభాగాల్లో APలో 34, TGలో 37 ఖాళీలు ఉన్నాయి. పోస్టులను బట్టి ITI, డిప్లొమా, డిగ్రీ, PG చేసి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. పోస్టును అనుసరించి స్టైపెండ్ రూ.13,000 నుంచి రూ.17,500 వరకు ఉంటుంది. అక్టోబర్ 6లోగా powergrid.in సైట్లో అప్లై చేసుకోవచ్చు.