News October 19, 2024

కండక్టర్లకు ఓడీ డ్యూటీలు విరమించుకున్న యాజమాన్యం

image

TG: ఆర్టీసీలో బస్సు కండక్టర్ల కొరత దృష్ట్యా యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డిపోలు, యూనిట్లలో ఓడీ(అవుట్ ఆఫ్ డిజిగ్నేషన్) డ్యూటీలను విరమించుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. కొంత కాలంగా కొందరు కండక్టర్లు డిపోలు, యూనిట్లలో సెక్యూరిటీ డ్యూటీలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారిని ఆ విధుల నుంచి తప్పించాలని జిల్లాల ఆర్టీసీ అధికారులను యాజమాన్యం ఆదేశించింది.

Similar News

News October 19, 2024

మహారాష్ట్ర ఎన్నికలు: FB, X, INSTAకు నోటీసులు

image

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు నోటీసులు ఇచ్చామని మహారాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్లను తికమకపెట్టేలా ఉన్న 1752 ఫేక్‌న్యూస్ పోస్టులను తొలగించాలని ఆదేశించామంది. ఇప్పటి వరకు FB 16, INSTA 28, X 251, YT 5 పోస్టులను డిలీట్ చేసినట్టు వెల్లడించింది. కోడ్ ఉల్లంఘనపై c-VIGIL యాప్ ద్వారా 420 ఫిర్యాదులు రాగా 414 పరిష్కరించామని తెలిపింది. రూ.10.64కోట్ల విలువైన నగదు, డ్రగ్స్, లిక్కర్ సీజ్ చేశామంది.

News October 19, 2024

ఛాన్స్ దొరికింది.. కుమ్మేశాడు

image

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో టన్నులకొద్దీ(4422) రన్స్. పదుల సంఖ్యలో సెంచరీలు(15), హాఫ్ సెంచరీలు(14). అయినా భారత జట్టులో చోటు కోసం పోరాటమే. అయితే తాజాగా అందివచ్చిన అవకాశాన్ని సర్ఫరాజ్ ఖాన్ అద్భుతంగా వినియోగించుకున్నారు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో కష్టాల్లో పడ్డ భారత్‌కు అండగా నిలిచారు. టెస్టుల్లో తన సెంచరీల ఖాతా ఓపెన్ చేశారు. జట్టులో స్థానం సుస్థిరం చేసుకునే దిశగా సాగుతున్నారు.

News October 19, 2024

వర్షంతో నిలిచిన మ్యాచ్

image

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు వర్షం కారణంగా నిలిచిపోయింది. నాలుగో రోజు తొలి సెషన్‌లో భారత బ్యాటర్ సర్ఫరాజ్(125) సెంచరీ చేయగా, పంత్(53) అర్ధసెంచరీతో క్రీజులో ఉన్నారు. భారత స్కోరు 344/3.