News October 19, 2024

VZM: వైసీపీ కోఆర్డినేటర్‌గా విజయసాయిరెడ్డి

image

ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ జిల్లా కోఆర్డినేటర్‌గా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నియమించారు. ఈ మేరకు పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతను విజయసాయిరెడ్డికి అప్పగిస్తూ పార్టీ అధినేత నిర్ణయం తీసుకున్నారు. కాగా గతంలో విశాఖ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా విజయసాయిరెడ్డి సేవలందించిన విషయం తెలిసిందే.

Similar News

News September 19, 2025

DSP శ్రీనివాసరావుకు బదిలీ

image

VZM సబ్ డివిజన్ DSP శ్రీనివాసరావును వీఆర్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై పలు అవినీతి ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంటెలిజెన్స్‌ విభాగం, పోలీస్‌ ఉన్నతాధికారులు DSPవ్యవహారాలపై సమగ్రంగా విచారణ జరిపిన అనంతరం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఉమెన్ PS DSPగా పనిచేస్తున్న గోవిందరావుకు ఇన్‌ఛార్జ్ DSPగా బాధ్యతలు అప్పగించారు.

News September 19, 2025

భోగాపురం విమానాశ్రయ భూములపై కలెక్టర్ ఆరా

image

భోగాపురం అంత‌ర్జాతీయ‌ విమానాశ్ర‌యం, జాతీయ ర‌హ‌దారులు, రైల్వే ప్రాజెక్టుల భూసేక‌ర‌ణ‌పై క‌లెక్ట‌రేట్లో సంబంధిత అధికారుల‌తో కలెక్టర్ రామసుందర రెడ్డి గురువారం స‌మీక్షా నిర్వ‌హించారు. ఇప్ప‌టివ‌ర‌కు జిఎంఆర్‌కు అప్ప‌గించిన 2,200 ఎక‌రాల భూముల ప‌రిస్థితి, వాటికి సంబంధించిన స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. విమాన‌యాన అనుబంధ ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు కోసం కేటాయించిన 540 ఎక‌రాల భూములపై ఆరా తీశారు.

News September 18, 2025

VZM: ‘యూరియా కొరతపై సోషల్ మీడియాలో అసత్య వార్తలు’

image

విజయనగరం జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. సోషల్ మీడియాలో కొంతమంది రైతులను తప్పుదారి పట్టించే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అటువంటి వార్తలు పూర్తిగా అసత్యమని ఆయన స్పష్టం చేశారు. యూరియాను ఇప్పటివరకు 30,395 మెట్రిక్ టన్నులు, 11,426 మెట్రిక్ టన్నులు డి.ఏ.పి, 9379 మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్ వివిధ కేంద్రాల్లో అందుబాటులో ఉంచామన్నారు.