News October 19, 2024
గాజాపై భీకర దాడి.. 33 మంది మృతి
గాజాపై ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో 33 మంది మరణించారు. వీరిలో 21 మంది మహిళలే ఉన్నారు. మరో 80 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నార్త్ గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపై ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు గాజాలో 42,500 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. లక్ష మందికిపైగా ప్రజలు గాయపడ్డారు.
Similar News
News October 19, 2024
OTD: GOAT విరాట్ రికార్డులు
రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఇదేరోజున 2023 WCలో BANతో జరిగిన మ్యాచ్లో వివిధ రికార్డులు నెలకొల్పారు. ఈ మ్యాచులో విరాట్ 78వ సెంచరీ చేసి అత్యంత వేగంగా 26వేల ఇంటర్నేషనల్ రన్స్ పూర్తిచేశారు. దీంతో ఆయన WCలో వెయ్యి పరుగులు చేసిన మొదటి NO.3 ఇండియన్ బ్యాటర్గా నిలిచారు. ICC వైట్బాల్ ఈవెంట్లలో అత్యధిక రన్స్ & అత్యధిక సెంచరీలు చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఈ రికార్డులను ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు.
News October 19, 2024
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే నిజమైన దోస్తాన్: బండి సంజయ్
TG: నిజమైన స్నేహం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒకటి కాదని నొక్కి చెప్పారు. హరియాణా, J&K ఎన్నికలకు కేసీఆర్ డబ్బులు పంపింది వాస్తవం కాదా? అని కేసీఆర్ను ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణ ఏమైందన్నారు. BRS, కాంగ్రెస్ మధ్య స్నేహం లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
News October 19, 2024
ఒక్క బాంబు బెదిరింపు కాల్తో రూ.3 కోట్ల నష్టం
బాంబు బెదిరింపు కాల్స్తో ఎయిర్లైన్స్ కంపెనీల చమురు వదులుతోంది! ఒక్కో నకిలీ కాల్ వల్ల రూ.3 కోట్ల వరకు నష్టపోతున్నట్టు అంచనా. దారి మళ్లిస్తే అదనపు ఫ్యూయల్ కోసం రూ.కోటి వరకు ఖర్చవుతోంది. ఇక ఫ్లైట్ ల్యాండింగ్, ఎయిర్పోర్ట్ పర్మిషన్లు, ప్రయాణికులకు లాడ్జింగ్, బోర్డింగ్, ఫుడ్, ఇతర అవసరాలకు మరో రూ.2కోట్లు కావాల్సి వస్తోంది. ఇప్పటి వరకు 40 ఫేక్ కాల్స్ వల్ల కంపెనీలపై రూ.60-80కోట్ల అదనపు భారం పడింది.