News October 19, 2024
IND vs NZ: రిషభ్ పంత్ వచ్చేశాడు

న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ బ్యాటింగ్కు వచ్చారు. ప్రస్తుతం సర్ఫరాజ్తో కలిసి ఆయన ఇన్నింగ్స్ను పునర్నిర్మించే పనిలో ఉన్నారు. కాగా తొలి ఇన్నింగ్స్లో కీపింగ్ చేస్తుండగా పంత్ గాయపడిన సంగతి తెలిసిందే. మోకాలివాపుతో ఆయన నిన్న ఫీల్డింగ్కు రాలేదు. దీంతో బ్యాటింగ్కు కూడా దిగుతారో లేదోనని అనుమానాలు తలెత్తాయి. ఎట్టకేలకు బ్యాట్ పట్టారు.
Similar News
News February 1, 2026
సౌమ్య కుటుంబానికి రూ.కోటి

TG: గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ <<19018914>>మరణించిన<<>> నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.కోటి నగదుతోపాటు ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సౌమ్య ఫ్యామిలీకి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఎక్సైజ్ విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఆయుధాలు సమకూర్చుతామన్నారు.
News February 1, 2026
వంటింటి చిట్కాలు

* టమాటా, పండు మిరపకాయ పచ్చళ్లు ఎర్రగా ఉండాలంటే తాలింపులో వంటసోడా కలిపితే సరిపోతుంది.
* కూరల్లో గ్రేవీ పలచగా అయినప్పుడు కాస్త మొక్కజొన్న పిండి కలిపితే గట్టిపడుతుంది.
* ఇడ్లీ పిండి పలుచగా అయినప్పుడు దానిలో చెంచా బ్రెడ్ పొడి, పావు చెంచా మొక్కజొన్న పిండిని నీళ్లలో కలిపి చేర్చితే పిండి గట్టిగా అవడంతో పాటు ఇడ్లీలు మృదువుగా వస్తాయి.
News February 1, 2026
కొనసాగుతున్న గోల్డ్, సిల్వర్ రేట్ల పతనం

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(MCX) <<19015375>>ఫ్యూచర్ ట్రేడింగ్లో<<>> బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. ఇవాళ వీటి రేట్లు భారీగా పడిపోయాయి. ఏప్రిల్కు సంబంధించి గోల్డ్ రేటు 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.4,834 తగ్గి రూ.1,47,511కు చేరింది. ఇక కేజీ వెండి ధర(మార్చి) రూ.26,273 క్షీణించి రూ.2,65,652 పలికింది. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఆదివారం కూడా స్టాక్ మార్కెట్లు పనిచేస్తున్నాయి.


