News October 19, 2024

వర్షంతో నిలిచిన మ్యాచ్

image

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు వర్షం కారణంగా నిలిచిపోయింది. నాలుగో రోజు తొలి సెషన్‌లో భారత బ్యాటర్ సర్ఫరాజ్(125) సెంచరీ చేయగా, పంత్(53) అర్ధసెంచరీతో క్రీజులో ఉన్నారు. భారత స్కోరు 344/3.

Similar News

News October 19, 2024

సెంచరీ మిస్.. స్టేడియంలో హార్ట్ బ్రేకింగ్!

image

గాయంతో బాధపడుతూనే రిషభ్ పంత్ సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. సెంచరీ చేస్తారని అంతా భావించగా 99 రన్స్ వద్ద ఔట్ అవడంతో స్టేడియమంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. మోకాలి నొప్పితోనే వీరోచితంగా ఆడి 9 ఫోర్లు, 5 సూపర్ సిక్సులతో పంత్ అదరగొట్టారు. పంత్‌కు సెంచరీ మిస్ అయినప్పటికీ ప్రేక్షకులు, ఆటగాళ్ల నుంచి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ఇది అభిమానులకు హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News October 19, 2024

రిజర్వేషన్లు రద్దు చేయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోంది: బండి సంజయ్

image

TG: గ్రూప్-1 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి ర్యాలీ చేస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రం మొత్తం అగ్గి రగులుతుంటే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు. రాబోయే రోజుల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది’ అని అన్నారు. మరోవైపు ర్యాలీలో BJP, BRS కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

News October 19, 2024

‘మూసీ’కి డబ్బులుంటాయి కానీ రైతు భరోసాకు లేవా?: KTR

image

TG: రైతు భరోసా అమలు చేసే వరకూ కాంగ్రెస్‌ను వదిలేది లేదని KTR అన్నారు. ‘కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు ఇవ్వదన్న KCR మాటలను రేవంత్ సర్కార్ నిజం చేసింది. స్వయంగా వ్యవసాయశాఖ మంత్రే చేతులేస్తున్నట్లు ప్రకటించారు. డబ్బుల్లేక సబ్ కమిటీ అంటూ డ్రామాలు స్టార్ట్ చేశారు. మూసీ సుందరీకరణకు డబ్బులుంటాయి కానీ రైతు భరోసాకు లేవా?’ అని ప్రశ్నించారు. రేపు అన్ని మండలాల్లో ఆందోళనలు చేయాలని BRS శ్రేణులకు పిలుపునిచ్చారు.