News October 19, 2024
గ్రూప్-1 అభ్యర్థుల నిరసనపై రాహుల్ స్పందించాలి: హరీశ్
TG: ఎన్నికల ముందు అశోక్నగర్లో తిరిగిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ‘గ్రూప్-1 అభ్యర్థుల ఆర్తనాదాలు వారికి వినిపించడం లేదా? రాహుల్ గాంధీ తప్పకుండా స్పందించాలి. అందరికీ న్యాయం చేయాలని KCR తెచ్చిన GO 55ను ఎందుకు రద్దు చేశారు? GO 29తో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యర్థులకు అన్యాయం జరుగుతోంది. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News October 19, 2024
రోడ్లపైకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు: DGP
TG: హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్-1 మెయిన్స్ నిర్వహిస్తున్నామని, ఇందుకోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ జితేందర్ తెలిపారు. నిరసన పేరుతో రోడ్లపైకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలపై అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని చెప్పారు. శాంతి భద్రతలను కాపాడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
News October 19, 2024
డెలివరీ సేవలపై కర్ణాటక సెస్!
జొమాటో, ఓలా, ఉబర్, స్విగ్గీ తదితర సంస్థల డెలివరీ సేవలపై పన్ను విధించాలని నిర్ణయించినట్లు కర్ణాటక కార్మిక మంత్రి సంతోష్ లాడ్ తెలిపారు. ‘రవాణా మీద మాత్రమే ఈ పన్ను విధిస్తున్నాం. డెలివరీ ఏజెంట్లు రోడ్డుపైనే ఎక్కువ ఉంటారు కాబట్టి వారు ప్రమాదాలకు గురయ్యేందుకు, కాలుష్యం బారిన పడి అనారోగ్యం పాలయ్యేందుకు అవకాశాలెక్కువ. ఈ డబ్బును వారి సంక్షేమానికి, వారి పిల్లల చదువులకు వినియోగిస్తాం’ అని పేర్కొన్నారు.
News October 19, 2024
రాహుల్ గాంధీపై వివాదాస్పద పోస్టు.. నటుడిపై కేసు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై వివాదాస్పద పోస్టు పెట్టిన ఒడిశా నటుడు బుద్ధాదిత్య మొహంతీపై కేసు నమోదైంది. ఎన్సీపీ నేత సిద్దిఖీని హత్య చేసిన లారెన్స్ బిష్ణోయ్ ముఠా తర్వాత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకోవాలని ఆయన పోస్టు పెట్టినట్లు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(NSUI) ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొహంతి ఆ పోస్టు డిలీట్ చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేశారు.