News October 19, 2024
రచిన్, సర్ఫరాజ్లను అభినందించిన సచిన్

టెస్టులో సెంచరీలు చేసిన న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర, టీమ్ఇండియా యంగ్ ప్లేయర్ సర్ఫరాజ్లను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభినందించారు. ‘క్రికెట్ మన మూలాలను కలుపుతుంది. బెంగళూరుతో రచిన్ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. అక్కడే అతను సెంచరీ చేశారు. పరుగుల లోటులో ఉన్న తన జట్టుకు సర్ఫరాజ్ అండగా నిలుస్తూ సెంచరీ బాదారు. ఈ ప్రతిభావంతులైన ఆటగాళ్లకి మున్ముందు మంచి కాలం ఉంటుంది’ అని తెలిపారు.
Similar News
News December 28, 2025
అలిపిరి మార్గంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ప్రారంభం

AP: తిరుమల అలిపిరి మెట్లమార్గంలోని 7వ మైలు వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్ను ప్రారంభించినట్లు TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. నడకదారిలో వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా అపోలో కార్డియాక్ సెంటర్ సహకారంతో ఈ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. శిక్షణ పొందిన సిబ్బందిచే తక్షణ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇటీవల కాంగ్రెస్ MP వంశీకృష్ణ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ <
News December 28, 2025
పాపులెవరు? ఎలాంటి వారికి నరకంలో శిక్ష పడుతుంది?

వేదశాస్త్రాలను నిందించేవారు, గోహత్య, బ్రహ్మహత్య చేసేవారు కఠిన శిక్షార్హులు. పరస్త్రీలను ఆశించేవారు, తల్లిదండ్రులను, గురువులను హింసించేవారు, దొంగతనాలు చేసేవారిని పాపాత్ములుగా పరిగణిస్తారు. శిశుహత్య, శరణు కోరిన వారిని బాధించడం, పెళ్లిళ్లు వంటి శుభకార్యాలను అపడం వల్ల కూడా నరకానికి పోతారట. ఈ దుశ్చర్యలు చేసే వారిని మరణానంతరం యమలోకానికి తీసుకెళ్లి, యముడి ఆజ్ఞ మేరకు నరకంలో కఠినంగా శిక్షిస్తారని నమ్మకం.
News December 28, 2025
IPLలో నో ఛాన్స్.. నేడు ₹కోట్ల సామ్రాజ్యం

టెస్ట్ అరంగేట్రంలో తొలి బంతికే వికెట్ తీసిన ఏకైక భారత బౌలర్గా చరిత్ర సృష్టించిన నీలేశ్ కులకర్ణి జర్నీ అద్భుతం. SLతో తొలి మ్యాచ్లో 70ఓవర్ల పాటు వికెట్ దక్కకపోయినా, IPL ఛాన్స్ రాకున్నా వెనక్కితగ్గలేదు. ఓటమినే పాఠంగా భావించి International Institute of Sports&Management (IISM) ద్వారా దేశంలోనే తొలి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ సామ్రాజ్యాన్ని నిర్మించారు. ప్లేయర్స్ మేనేజ్మెంట్లోనూ గెలవొచ్చని నిరూపించారు.


