News October 19, 2024

రోడ్లపైకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు: DGP

image

TG: హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్-1 మెయిన్స్ నిర్వహిస్తున్నామని, ఇందుకోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ జితేందర్ తెలిపారు. నిరసన పేరుతో రోడ్లపైకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలపై అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని చెప్పారు. శాంతి భద్రతలను కాపాడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

Similar News

News October 19, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

APలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, గోదావరి జిల్లాల్లో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. TGలోనూ పలు జిల్లాల్లో రేపు మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణశాఖ పేర్కొంది.

News October 19, 2024

వయనాడ్ బీజేపీ అభ్యర్థిగా నవ్య హరిదాస్

image

కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికకు బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. నవ్య హరిదాస్ పేరును ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ స్థానానికి కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. వయనాడ్ ఎంపీ అభ్యర్థితో పాటు అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్‌లో జరిగే అసెంబ్లీ ఉపఎన్నికలకూ బీజేపీ తమ అభ్యర్థుల పేర్లను వెల్లడించింది.

News October 19, 2024

శోభితతో నాగచైతన్య.. కొత్త ఫొటో వైరల్

image

నటి శోభితతో కలిసి తీసుకున్న ఓ ఫొటోను హీరో అక్కినేని నాగచైతన్య తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘Everything everywhere all at once’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఏడాది ఆగస్టులో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చైతూ ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్నారు. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. రిలీజ్ డేట్‌పై ప్రకటన రావాల్సి ఉంది.