News October 19, 2024
IAS అధికారి అమోయ్కు ఈడీ నోటీసులు
తెలంగాణకు చెందిన IAS అమోయ్ కుమార్కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్న సమయంలో భూ కేటాయింపుల వ్యవహారంలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఈడీ ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగానే ఆయనకు నోటీసులు పంపింది.
Similar News
News October 19, 2024
APPLY NOW.. 8,113 ఉద్యోగాలు
రైల్వేలో 8,113(గూడ్స్ ట్రైన్ మేనేజర్-3144, టికెట్ సూపర్ వైజర్-1736, టైపిస్ట్-1507, స్టేషన్ మాస్టర్-994, సీనియర్ క్లర్క్-732) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ రేపటితో ముగియనుంది. డిగ్రీ అర్హతతో 18-36 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేయవచ్చు. రిజర్వేషన్ బట్టి వయోసడలింపు ఉంటుంది. SCRలో 478, ECoRలో 758 పోస్టులున్నాయి. ఫీజు: రూ.500(ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైతే రూ.400 రీఫండ్). మరిన్ని వివరాలకు <
News October 19, 2024
INDvsPAK: భారత్ స్కోర్ ఎంతంటే?
ఏసీసీ మెన్స్ టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2024లో భాగంగా పాక్-Aతో మ్యాచులో ఇండియా-A 183/8 స్కోర్ చేసింది. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ 44, ప్రభ్సిమ్రాన్ 36, అభిషేక్ 35, వధేరా 25 రన్స్ చేశారు. ఈ మ్యాచులో పాక్ గెలవాలంటే 20 ఓవర్లలో 184 రన్స్ చేయాలి.
News October 19, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
APలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, గోదావరి జిల్లాల్లో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. TGలోనూ పలు జిల్లాల్లో రేపు మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణశాఖ పేర్కొంది.