News October 19, 2024
మహారాష్ట్ర Seat Sharing: కాంగ్రెస్పై శివసేన సెటైర్లు

పోలింగ్కు నెలరోజులే ఉంది. అయినా మహారాష్ట్ర MVA కూటమిలో సీట్ల పంపకం కొలిక్కిరావడం లేదు. ఎవరికి వారు తామే ఎక్కువ సీట్లలో పోటీచేయాలని భావిస్తున్నారు. పరస్పరం పరోక్షంగా సెటైర్లు వేసుకుంటున్నారు. విదర్భలో ఎక్కువ సీట్లు తమకే ఇవ్వాలని శివసేన UBT అడుగుతోంది. కాంగ్రెస్ నేత నానా పటోలే అందుకు ససేమిరా అంటున్నారు. దీంతో ఆయనుంటే అసలు సీట్ల చర్చకే రాలేమని, లోకల్ లీడర్స్కు ఆ స్థాయిలేదని SS చెప్పడం గమనార్హం.
Similar News
News January 21, 2026
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News January 21, 2026
‘2000s’ గ్యాంగ్.. క్రికెటర్ల సెల్ఫీ వైరల్

2000దశకంలో క్రికెట్ చూడటం మొదలుపెట్టిన వారికి పైఫొటోలో ఎవరో ఒకరు ఫేవరెట్ ప్లేయరై ఉంటారు. ఓపెనర్గా సెహ్వాగ్ బాదుడు, సిక్సర్ల వీరుడు యువరాజ్, ఫీల్డింగ్లో కైఫ్ దూకుడు, బౌలింగ్లో అగార్కర్, నెహ్రా సత్తా.. ఇలా అప్పట్లో వీరి ఆటకు క్రేజే వేరు. తాజాగా వీరంతా ఒకే దగ్గర కలుసుకొని సెల్ఫీ దిగారు. లెజెండరీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ కుమారుడు అంగద్ బేడీ, స్పోర్ట్స్ ప్రజెంటర్ గౌరవ్ కపూర్ కూడా వీరితో ఉన్నారు.
News January 21, 2026
‘అగ్రిటెక్’తో వ్యవసాయ రంగంలో మార్పులు: CBN

AP: అగ్రిటెక్ విధానం అమలుతో రాష్ట్ర వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయని CBN తెలిపారు. చిత్తశుద్ధితో పనిచేస్తే ఏదైనా సాధ్యమని నమ్ముతాను. విశాఖకు గూగుల్ సంస్థ రాక గొప్ప ముందడుగు. దీని కోసం లోకేశ్ ఎంతో కష్టపడ్డారు. గ్రీన్ ఎనర్జీ, అమ్మోనియా గురించి లోకం చర్చిస్తున్న సమయంలో AP ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తోంది. అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దుతున్నాం’ అని దావోస్లో మీడియాతో పేర్కొన్నారు.


