News October 19, 2024
రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
AP: విశాఖ శారదా పీఠానికి ఇచ్చిన స్థలం అనుమతిని రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విశాఖలో 15 ఎకరాల స్థలం విలువ రూ.220 కోట్లు అయితే గత ప్రభుత్వంలో రూ.15 లక్షలకు శారదా పీఠానికి కేటాయించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కూటమి ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. నివేదిక ఆధారంగా స్థలం అనుమతులను రద్దు చేసింది. దీనిపై సోమవారం అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.
Similar News
News October 20, 2024
పంత్ ఔట్ను ముందే చెప్పిన నెటిజన్!
టెస్టు మ్యాచ్లో నాలుగోరోజు రిషభ్ పంత్ 99 పరుగులకు ఔటైన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని ఓ నెటిజన్ ముందుగానే పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అంత ముందుగా, కచ్చితత్వంతో అతడెలా చెప్పాడన్నది మిస్టరీగా మారింది. నువ్వు మ్యాచ్ ఫిక్సర్వా అంటూ కొంతమంది, నా జాతకం చెప్పు బాస్ అంటూ మరికొంతమంది అతడి ట్వీట్ కింద కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం నీవల్లే రిషభ్ ఔటయ్యారంటూ మండిపడుతున్నారు.
News October 20, 2024
కర్వా చౌత్.. రూ.22 వేల కోట్ల వ్యాపారం?
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రేపు కర్వా చౌత్ వేడుక జరుపుకోనున్నారు. గత ఏడాది ఈ పండుగకు రూ.15వేల కోట్ల మేర వ్యాపారం జరగగా, ఈసారి అది రూ.22 వేల కోట్లకు పెరగొచ్చని వ్యాపారులు అంచనా వేశారు. ఢిల్లీలోనే రూ.4వేల కోట్ల మేర వ్యాపారం జరగొచ్చని అభిప్రాయపడ్డారు. ఎర్రగాజులు, సంప్రదాయ దుస్తులు, పూజాసామగ్రి, లాకెట్లు, మెట్టెలు, ఆభరణాల వంటివాటికి డిమాండ్ నెలకొందని వివరించారు.
News October 20, 2024
తెలంగాణ పోలీసులు దేశానికే గర్వకారణం: సీఎం రేవంత్
తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరుగుతున్న తొలి పోలీస్ డ్యూటీ మీట్కు హాజరుకావడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడే ఖాకీ సైనికులు, పెట్టుబడుల సాధనకు భరోసా కల్పించే శాంతిభద్రతకు ప్రతినిధులు, దేశానికే గర్వకారణం తెలంగాణ పోలీసులు’ అంటూ ఓ ట్వీట్లో కొనియాడారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం, ప్రజాపాలన అన్న హాష్ ట్యాగ్లను దానికి జోడించారు.