News October 19, 2024

వినుకొండ-గుంటూరు మధ్య 4 లైన్ల రహదారికి గ్రీన్ సిగ్నల్

image

వినుకొండ-గుంటూరు మధ్య 4 లైన్ల రహదారి నిర్మాణంకు కూటమి ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించి నిధులు మంజూరు చేపించుకుంది. ఈ సందర్భంగా పల్నాడులో రహదారుల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. పేరేచర్ల-కొండమోడు, వినుకొండ-గుంటూరు మధ్య నాలుగు లైన్ల నిర్మాణంను కూటమి ప్రభుత్వం చేపట్టనుంది. దీంతో పల్నాడు ప్రజలందరూ సీఎం చంద్రబాబు, ఎంపీ లావుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News January 6, 2026

ANU వ్యాయామ విద్య పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి జరగనున్న బీపీఈడీ, డీపీఈడీ, ఎంపీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ వర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు విడుదల చేశారు. సంబంధిత పరీక్ష ఫీజు ఈనెల 20 తేదీలోగా, అపరాధ రుసుం రూ.100తో ఈనెల 21వ తేదీన చెల్లించాలన్నారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్‌సైట్ www.Nagarjuna University.ac.in పొందవచ్చన్నారు.

News January 6, 2026

ANU బీ ఫార్మసీ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి జరగనున్న బీ ఫార్మసీ నాలుగో సంవత్సరం 7వ సెమిస్టర్, 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు షెడ్యూల్ వర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి శివ ప్రసాదరావు విడుదల చేశారు. సంబంధిత పరీక్ష ఫీజు ఈనెల 22 తేదీలోగా, అపరాధ రుసుం రూ.100తో ఈనెల 23వ తేదీన చెల్లించాలన్నారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్ సైట్ www.Nagarjuna University.ac.in పొందవచ్చన్నారు.

News January 6, 2026

తెనాలిలో ఉద్రిక్త వాతావరణం

image

తెనాలి వహాబ్ చౌక్‌లో ఉద్రిక్తత నెలకొంది. డివైడర్ మధ్యలో ఉన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలు తొలగించేందుకు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది ప్రయత్నించడంతో టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. నాయకులు, కార్యకర్తలు భారీగా వహాబ్ చేరుకొని రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కుట్రపూరితంగా ఫ్లెక్సీలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు.