News October 20, 2024
సాలూరు: నియోజకవర్గ సమన్వయకర్తలతో మంత్రి సమావేశం

సాలూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ సమన్వయకర్తలతో మంత్రి గుమ్మడి సంధ్యారాణి శనివారం సాలూరులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె టీడీపీ పార్టీ రాష్ట్ర సమావేశంలో జరిగిన విషయాలను తెలిజయేశారు. ఈ నెల 26 తేదిన సీఎం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తారని, నియోజకవర్గంలో కూడా అత్యధికంగా నమోదుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నేతలు బంజేదేవ్, పరమేసు, ప్రసాద్, వేణు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 10, 2025
గృహలబ్ధిదారుల వివరాలు నమోదు చేయండి: DRO

గృహాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి వివరాలను సర్వే చేసి అర్హత ఉన్న వారి వివరాలను యాప్లో నమోదు చేయాలని DRO శ్రీనివాసమూర్తి సోమవారం ఆదేశించారు. నవంబర్ 30 వరకు ప్రభుత్వం సర్వేకు సమయం ఇచ్చిందని, లబ్ధిదారుల సర్వే పూర్తి చేసి అప్లోడ్ చేయాలని తెలిపారు. మండల ప్రత్యేకాధికారులు సచివాలయాల తనిఖీ చేసి ప్రొఫార్మాలో వివరాలను నమోదు చేసి సమర్పించాలని సూచించారు.
News November 10, 2025
వారం రోజుల్లో నివేదికలు సమర్పించాలి: ASP

ప్రజల ఫిర్యాదులను చట్టపరిధిలోని తక్షణమే పరిష్కరించాలని పోలీసు అధికారులను అదనపు ఎస్పీ పి.సౌమ్యలత ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా 42 ఫిర్యాదులను స్వీకరించిన అదనపు ఎస్పీ, ఫిర్యాదుదారుల సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. ఫిర్యాదులను పరిశీలించి 7రోజుల్లో నివేదికలు సమర్పించాలని ఆమె ఆదేశించారు.
News November 10, 2025
విజయనగరం కలెక్టర్ ఆఫీసుకి 178 ఫిర్యాదులు

ప్రజా ఫిర్యాదులను సకాలంలో పారదర్శకంగా పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 178 ఫిర్యాదులు స్వీకరించగా, వాటిలో 63 రెవెన్యూ, 29 డీఆర్డీఏ, 20 GSW విభాగాలకు సంబంధించినవని తెలిపారు. ప్రతి దరఖాస్తుదారు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని, పరిష్కారామయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలన్నారు.


