News October 20, 2024

మెయిన్స్ పరీక్ష వాయిదా వేస్తే నష్టమేంటి: శ్రీనివాస్ గౌడ్

image

TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేస్తే వచ్చే నష్టమేంటని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. అభ్యర్థుల్ని నిర్బంధిస్తూ పరీక్షలు నిర్వహించడం అవసరమా? అని ప్రశ్నించారు. వారికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. కేంద్రమంత్రి బండి సంజయ్ పొలిటికల్ జోకర్‌గా మారారని విమర్శించారు. మోదీకి ముగ్గురు తమ్ముళ్లని.. పెద్దోడు రేవంత్, నడిపోడు బండి, చిన్నోడు అరవింద్ అని ఎద్దేవా చేశారు.

Similar News

News March 15, 2025

MLAలు రూ.800కోట్లు డిమాండ్ చేస్తున్నారు: DK శివకుమార్

image

బెంగళూరులో చెత్త సంక్షోభంపై వివిధ పార్టీల ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని Dy.CM DK శివకుమార్ ఆరోపించారు. సిటీ ఎమ్మెల్యేలంతా కలసి సిటీ డెవలప్‌మెంట్ ఫండ్ నుంచి రూ.800 కోట్లు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. కాంట్రాక్టర్లంతా సిండికేట్‌గా మారి ‌సాధారణ ధరల కంటే 85శాతం అధికంగా కోట్ చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా కోర్టును ఆశ్రయించారన్నారు.

News March 15, 2025

మార్చి15: చరిత్రలో ఈరోజు

image

*1493: మెుదటి పర్యటన అనంతరం స్పెయిన్ చేరిన కొలంబస్
*1564: జిజియా పన్ను రద్దు
*1934: బీఎస్‌పీ పార్టీ స్థాపకుడు కాన్షీరాం జననం
*1937: తెలుగు సాహితి విమర్శకుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్య జననం
* 1950: ప్రణాళిక సంఘం ఏర్పాటు
*1983: ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం
*1990: సోవియట్ యూనియన్ మెుదటి అధ్యక్షుడిగా గోర్బచేవ్ ఎన్నిక

News March 15, 2025

RRR, పుష్ప ఫలితాలపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు

image

కథ బాగా చెప్తే ఏ భాషలో అయినా, ఏ రాష్ట్రం‌లో అయినా, ఏ దేశంలో అయినా సినిమా ఆడుతుందని హీరో మంచు విష్ణు నమ్మకం వ్యక్తం చేశారు. బాహుబలి, RRRలే సినిమాలే అందుకు ఉదాహరణ అని చెప్పారు. RRR సినిమాలోని అల్లూరి, కొమురంభీం గురించి తెలుగు వారికి తప్ప ఎవరికీ తెలియదని కథ చెప్పే విధానం వల్లే సూపర్ హిట్‌గా నిలిచాయన్నారు. అదే కారణంతో పుష్ప సినిమా కూడా తెలుగులో కంటే హిందీలో పెద్ద హిట్ అయిందని అని చెప్పారు.

error: Content is protected !!