News October 20, 2024
పుష్పశ్రీవాణి ఎస్టీనే అని తేల్చిన హైకోర్టు
AP: మాజీ మంత్రి పుష్పశ్రీవాణి ST కులానికి చెందిన వారేనని హైకోర్టు తీర్పునిచ్చినట్లు ఆమె ఓ ప్రకటనలో తెలిపారు. DLSC కమిటీ రిపోర్ట్, స్టేట్ స్క్రూటినీ కమిటీ ఇచ్చిన జీవో 6ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. పిటిషనర్ వద్ద ఆధారాలు లేవంటూ కేసు కొట్టివేసింది. కాగా ఆమె ST కాదంటూ ఇద్దరు వ్యక్తులు 2019లో పిటిషన్ వేశారు. ఓ వర్గం కావాలనే తప్పుడు ప్రచారం చేసిందని, చివరకు న్యాయమే గెలిచిందని పుష్పశ్రీవాణి అన్నారు.
Similar News
News October 20, 2024
బద్వేల్ ఘటన.. కీలక విషయాలు వెలుగులోకి
AP: <<14403526>>బద్వేల్ ఘటనలో<<>> కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో యువతిని అడ్డు తొలగించేందుకు నిందితుడు విఘ్నేశ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు విచారణలో ప్రాథమికంగా తేల్చారు. ఆ యువతి అతనికి చిన్నతనం నుంచే పరిచయం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల విఘ్నేశ్కు వేరొకరితో వివాహమైంది. ఈ క్రమంలో పథకం ప్రకారమే యువతిని బైక్పై తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పేర్కొన్నారు.
News October 20, 2024
ప్రభాస్ బర్త్ డే.. CDP విడుదల
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా కామన్ డీపీ విడుదలైంది. ఈనెల 23న ఇదే ఫొటోను ప్రభాస్ అభిమానులంతా తమ సోషల్ మీడియా అకౌంట్ల డిస్ప్లే పిక్చర్గా పెట్టుకోనున్నారు. కల్కిలో విల్లుతో ఉన్న ప్రభాస్ ఫొటోతో పాటు ఆదిపురుష్, సలార్, బాహుబలి, రాజాసాబ్ లుక్స్ను ఉంచారు. ఇందులో ‘స్టారంటే రెబలేరా’ ట్యాగ్లైన్ హైలైట్. బర్త్ డే సందర్భంగా ‘సలార్’, ఈశ్వర్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు రీరిలీజవుతున్నాయి.
News October 20, 2024
BREAKING: భారత్ పరాజయం
న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచులో భారత్ పరాజయం పాలైంది. 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన NZ 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యంగ్(45*), రవీంద్ర(39*) జట్టును విజయతీరాలకు చేర్చారు. భారత బౌలర్ బుమ్రా 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్సులో భారత్ 46 పరుగులకే ఆలౌటవ్వగా, రెండో ఇన్నింగ్సులో 462 పరుగులు చేసింది. మరోవైపు NZ తొలి ఇన్నింగ్సులో 402 రన్స్ చేసిన సంగతి తెలిసిందే.