News October 20, 2024

ఒలింపిక్ వీరుడికి క్యాన్సర్.. ఇంకా నాలుగేళ్లే!

image

బ్రిటిష్ ఒలింపిక్ సైక్లింగ్ ఛాంపియన్ సర్ క్రిస్ హోయ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ప్రకటించారు. తాను ప్రస్తుతం చివరి దశలో ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను రెండు నుంచి నాలుగేళ్ల మధ్యలో జీవించే అవకాశం ఉందని వారు చెప్పినట్లు తెలిపారు. 48 ఏళ్ల స్కాట్ 2004- 2012 మధ్యకాలంలో ఆరుసార్లు ఒలింపిక్ స్వర్ణాలు గెలుచుకున్నారు.

Similar News

News January 31, 2026

బెదిరింపులు ఆపితే అమెరికాతో చర్చలకు సిద్ధమే: ఇరాన్

image

ట్రంప్ ప్రభుత్వం తన బెదిరింపులను ఆపితే చర్చలకు సిద్ధమని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ ప్రకటించారు. ఇరాన్ యుద్ధానికి ఎంత సిద్ధంగా ఉందో, చర్చలకూ అంతే సంసిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అయితే తమ మిస్సైల్ కార్యక్రమంపై మాత్రం రాజీ పడబోమని తేల్చి చెప్పారు. అమెరికా సైనిక చర్యలకు దిగితే అది ఇరు పక్షాల మధ్య యుద్ధంగా మిగిలిపోదని, మిడిల్ ఈస్ట్ అంతటా ఉద్రిక్తతలకు దారితీస్తుందని హెచ్చరించారు.

News January 31, 2026

రీప్లేస్‌మెంట్‌కు రెడీ.. పాక్ స్థానంలో ఆడతామన్న ఉగాండా

image

T20 WCలో ఆడటంపై పాక్ ఇప్పటికీ తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. దీంతో క్రికెట్ ఆడే చిన్న దేశాలు పాకిస్థాన్‌ను ట్రోల్ చేస్తున్నాయి. ఇప్పటికే దాని స్థానంలో తమకు అవకాశం ఇవ్వాలని కోరిన <<18982902>>ఐస్‌లాండ్<<>>.. ఆ వెంటనే అందుబాటులో ఉండలేమని సెటైరికల్‌ పోస్ట్ చేసింది. ఇది ఉగాండాకు కలిసొస్తుందని పేర్కొంది. దీంతో నేడు ఉగాండా కూడా అవకాశం ఉంటే ఆడేందుకు తాము సిద్ధమని.. బ్యాగ్‌లు రెడీ చేసుకున్నామని ఫన్నీగా పోస్ట్ పెట్టింది.

News January 31, 2026

జంతు కొవ్వు కలిసిందని కేంద్ర సంస్థే చెప్పింది: లోకేశ్

image

AP: దేవుడి లడ్డూపై వైసీపీ డ్రామా మొదలుపెట్టిందని, అప్రమత్తంగా ఉండాలని మంత్రి లోకేశ్ టీడీపీ శ్రేణులకు సూచించారు. ‘2024లో చంద్రబాబు సీఎం కాగానే నెయ్యి శాంపిల్స్ తీసుకోవాలని ఆదేశించారు. కేంద్ర ఆధ్వర్యంలోని సంస్థ ద్వారా టెస్ట్ చేయగా జంతు కొవ్వు కలిసిందని, వెజిటబుల్ ఆయిల్ ఉందని తేలింది. మొన్నటి ఛార్జ్‌షీట్ పేజీ నెం.35లో సీబీఐ చాలా స్పష్టంగా చెప్పింది’ అని కాకినాడలో కార్యకర్తల సమావేశంలో తెలిపారు.