News October 20, 2024

ప.గో జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి ఖరారు

image

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్‌ను ఖరారు చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పత్రిక ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ అభ్యర్థి కోసం సందిగ్ధత నెలకొంది. దీంతో నేడు విడుదల చేసిన ప్రకటనతో ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిపై స్పష్టత వచ్చింది.

Similar News

News January 1, 2026

తణుకు: దంపతులను ఢీ కొట్టిన లారీ.. భార్య మృతి

image

తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందారు. తణుకు మండలం వేల్పూరుకి చెందిన అందే లోకేశ్వరరావు, అందే వెంకటలక్ష్మి (48) దంపతులు తాడేపల్లిగూడెం వైపు నుంచి తణుకు వైపు మోటార్ సైకిల్‌పై వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాల పాలైన లోకేశ్వరరావును చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News January 1, 2026

పండుగలా పాస్‌ పుస్తకాల పంపిణీ చేపట్టాలి: జేసీ

image

జిల్లాలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీని పండుగ వాతావరణంలో చేపట్టాలని జేసీ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం భీమవరంలో ఆర్డీవోలు, తహశీల్దార్లతో నిర్వహించిన గూగుల్‌ మీట్‌లో ఆయన మాట్లాడారు. జనవరి 2 నుంచి 9 వరకు ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని, రెవెన్యూ క్లినిక్‌ల పనితీరుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

News December 31, 2025

జనవరి 5న జిల్లాలో గ్రామసభలు: కలెక్టర్

image

వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవికా మిషన్, గ్రామీణ్ పథకంపై జనవరి 5న జిల్లాలో అన్ని గ్రామాలలో గ్రామసభలు నిర్వహించాలి కలెక్టర్ నాగరాణి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో గ్రామీణ్ పథకంపై పనులపై సమీక్షించారు. వీబీజీ రాంజీ పథకంలో భాగంగా 100 రోజుల నుంచి 125 రోజులు పని దినాలు కల్పించడం జరిగిందన్నారు. 60 శాతం కేంద్ర ప్రభుత్వం 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.