News October 20, 2024
ఢిల్లీ ఒకప్పటి ముంబైలా తయారైంది: ఢిల్లీ సీఎం
రోహిణి ప్రాంతంలోని స్కూల్ బయట బాంబు పేలుడు జరగడంపై ఢిల్లీ సీఎం ఆతిశీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘నగరం పరిస్థితి 90వ దశకంలో ముంబైలా తయారైంది. ఇక్కడి శాంతి భద్రతలు కేంద్రం చేతిలోనే ఉన్నాయి. కానీ ఆ పని వదిలేసి మా ప్రభుత్వాన్ని అడ్డుకోవడంపై దృష్టి పెడుతోంది. సిటీలో ఇష్టానుసారం తూటాలు పేలుతున్నాయి. బ్లాక్మెయిల్స్, నేరాలు ఘోరంగా పెరిగిపోయాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Similar News
News October 21, 2024
హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం
TG: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఆయన శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్తున్న సమయంలో ఓ కారు కాన్వాయ్ మధ్యలోకి వచ్చింది. దీంతో కాన్వాయ్లోని ఓ వాహనం సడన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్లోని మూడు వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో భద్రతా సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 21, 2024
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న నటి కూతురు
క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్య కృష్ణన్ టాలీవుడ్ సినీ అభిమానులకు సుపరిచితురాలే. నటనతోనే కాకుండా తన వాయిస్తో ఆమె బాగా పాపులర్ అయ్యారు. అయితే ఇప్పుడు సత్య కూతురు అనన్య కృష్ణన్ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు. జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్ హీరోగా తెరకెక్కుతున్న కేసీఆర్(కేశవచంద్ర రమావత్) చిత్రంలో అనన్య లీడ్ రోల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది.
News October 21, 2024
అక్టోబర్ 21: చరిత్రలో ఈరోజు
1833: శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ జననం
1902: స్వాతంత్ర్య సమరయోధుడు అన్నాప్రగడ కామేశ్వరరావు జననం
1947: ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు జననం
1967: క్రీడాకారిణి అశ్వినీ నాచప్ప జననం
1992: హీరోయిన్ శ్రీనిధి శెట్టి జననం
1996: ప్రముఖ చిత్రకారుడు పాకాల తిరుమల్ రెడ్డి మరణం
✦పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం