News October 20, 2024
ఉత్తర తెలంగాణలో అతిపెద్ద స్టేడియం నిర్మాణానికి కృషి: నరేందర్ రెడ్డి

ఉత్తర తెలంగాణ కేంద్రంగా అతిపెద్ద స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానని వ్యాయామ ఉపాధ్యాయులకు MLC అభ్యర్థి నరేంద్ర రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం వ్యాయామ ఉపాధ్యాయుల మీట్లో పాల్గొన్నారు. చాలా చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా మైదానాలు ప్రహరీ గోడలు లేక అన్యక్రాంతమవుతున్నాయని, వాటికి ప్రహరీ గోడల నిర్మాణానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్త ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరానికి చర్యలు చేపడుతామన్నారు.
Similar News
News September 16, 2025
పోషణ మాసోత్సవాలకు ఎమ్మెల్యే కవ్వంపల్లికి రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు జరిగే పోషణ మాసోత్సవాల కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనాయణకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఈ మేరకు, కరీంనగర్ జిల్లా మహిళా సంక్షేమ అధికారి ఎం. సరస్వతి, మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఆహ్వాన పత్రాన్ని మంగళవారం ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్లో ఎమ్మెల్యేకు అందజేశారు.
News September 16, 2025
కరీంనగర్: ‘చేప పిల్లల పంపిణీ త్వరగా చేపట్టాలి’

మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ త్వరగా చేపట్టాలని, కరీంనగర్ జిల్లాలోని మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం మత్స్య శాఖ కమిషనర్ ఐఏఎస్ నిఖిలకు కరీంనగర్ జిల్లా మత్స్యకారులు వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్ మత్స్యశాఖ కార్యాలయంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని, చేప పిల్లలను సకాలంలో పంపిణీ చేస్తేనే మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి జరుగుతుందన్నారు.
News September 16, 2025
కరీంనగర్: కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్గా విద్యాసాగర్

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ SC సెల్ కన్వీనర్గా శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన కనకం విద్యాసాగర్ నియమితులయ్యారు. ఈ నియామక పత్రాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మానకొండూరు MLA కవ్వంపల్లి సత్యనారాయణ అందజేశారు. LMDలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు విద్యాసాగర్ను అభినందించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని విద్యాసాగర్ తెలిపారు.