News October 21, 2024
నాడు టాటా నాటిన మొక్క నేడు వృక్షమైంది

దివంగత రతన్ టాటా 23 ఏళ్ల క్రితం బెంగళూరులోని ఇన్ఫోసిస్ క్యాంపస్లో నాటిన ఓ మొక్క నేడు వృక్షంగా ఎదిగింది. 2001, అక్టోబరు 15న టాటా ఇన్ఫీ ప్రాంగణాన్ని సందర్శించారు. ఆ సమయంలో టబీబుయా రోజియా జాతికి చెందిన మొక్కను అక్కడ నాటారు. నేడు అది పది మందికి నీడనిస్తూ ఆయన జీవితాన్ని గుర్తుచేస్తోంది. ఇటీవలే ఆయన కన్నుమూసిన నేపథ్యంలో ఆ చెట్టు ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Similar News
News February 1, 2026
2 గంటలుగా కేసీఆర్ విచారణ

TG: ఫోన్ ట్యాపింగ్ కేసుపై మాజీ సీఎం కేసీఆర్ను సిట్ రెండు గంటలుగా విచారిస్తోంది. అధికారులు ఏం ప్రశ్నలు అడిగారు? ఆయన ఏం సమాధానాలిచ్చారనేది ఆసక్తికరంగా మారింది. ఇదే కేసులో ఇప్పటికే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, అడిషనల్ ఎస్పీలు రాధాకిషన్ రావు, తిరుపతన్న, కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్లను సిట్ విచారించిన విషయం తెలిసిందే.
News February 1, 2026
పొద్దుతిరుగుడు సాగు.. విత్తన మోతాదు, విత్తనశుద్ధి

యాసంగిలో పొద్దుతిరుగుడు సాగుకు సాధారణంగా ఎకరానికి 2.5-3.0 కిలోల విత్తనం అవసరం. పంట మొదటి దశలో ఆశించే చీడపీడల నివారణకు కిలో విత్తనానికి థయోమిథాక్సామ్ 3.0 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5.0 మి.లీ. కలిపి విత్తనశుద్ధి చేయాలి. సాధారణ దుక్కి పద్ధతిలో లేదా వరికోతలు తర్వాత జీరో టిల్లేజ్ పద్ధతిలో నవంబర్, డిసెంబర్ నెలల్లో విత్తుకోవచ్చు. వరికోతలు ఆలస్యమైన ప్రాంతాల్లో ఫిబ్రవరి మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు.
News February 1, 2026
ESIC మోడల్ హాస్పిటల్ బడ్డీలో ఉద్యోగాలు

<


