News October 21, 2024

నేటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్.. భారీ బందోబస్తు

image

తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టులకు నేటి నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. పరీక్షను వాయిదా వేయాలంటూ కొందరు అభ్యర్థులు నిరసనలు చేస్తున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ రూమ్, చీఫ్ సూపరింటెండెంట్, పరిసర ప్రాంతాల్లో CC కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల వరకు ఐదుగురికి మించి ఉండకుండా పోలీసులు BNSS 163 సెక్షన్ విధించారు.

Similar News

News October 21, 2024

వాలంటీర్ హత్య కేసు.. మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్

image

AP: మాజీ మంత్రి, YCP నేత పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను పోలీసులు మదురైలో అరెస్ట్ చేశారు. కోనసీమ అల్లర్ల సమయంలో(2022 జూన్ 6న) అయినవిల్లికి చెందిన వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఇప్పటికే YCP సోషల్ మీడియా కన్వీనర్ ధర్మేశ్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో శ్రీకాంత్ పేరు బయటికి రావడంతో తాజాగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ శ్రీకాంత్‌ను కోర్టులో హాజరుపర్చనున్నారు.

News October 21, 2024

దివ్వెల మాధురికి పోలీసుల నోటీసులు

image

AP: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్వెల మాధురికి తిరుమల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల తిరుమల వెళ్లిన మాధురి అక్కడ ఫొటోషూట్స్, రీల్స్ చేశారంటూ టీటీడీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు<<14326522>> కేసు నమోదైంది<<>>. దీంతో తిరుమల వన్ టౌన్ పోలీసులు టెక్కలిలోని అక్కవరం సమీపంలో శ్రీనివాస్, మాధురి ఉంటున్న ఇంటికి వెళ్లి ఆమెకు నోటీసులిచ్చారు.

News October 21, 2024

సేవింగ్స్ ఖాతాలపై బ్యాంకుల వడ్డీ రేట్లు ఇలా..

image

IDFC బ్యాంక్: రూ.5లక్షల లోపు బ్యాలెన్స్‌పై 3% వడ్డీ, రూ.5 లక్షల- రూ.100 కోట్ల మధ్య బ్యాలెన్స్ ఉంటే అత్యధికంగా 7.25% వడ్డీ అందిస్తోంది.
HDFC, ICICI: రూ.50 లక్షల లోపు 3% వడ్డీ, ఆపై బ్యాలెన్స్ ఉంటే 3.5% వడ్డీ అందిస్తున్నాయి.
SBI: రూ.10 కోట్ల లోపు బ్యాలెన్స్‌పై 2.70 %, ఆపై ఉంటే 3% వడ్డీ అందిస్తోంది
PNB: రూ.10 లక్షల లోపు బ్యాలెన్స్‌కు 2.70%, రూ.10 లక్షల- రూ.100 కోట్ల మధ్య ఉంటే 2.75% చెల్లిస్తుంది.