News October 21, 2024

నేడు సుప్రీంలో గ్రూప్-1పై విచారణ

image

TG: గ్రూప్-1 పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు, అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. జీవో 29పైనే ప్రధానంగా ఇవాళ న్యాయస్థానంలో వాదనలు జరుగుతాయని, తమకు న్యాయం జరుగుతుందని పిటిషనర్లు ఆశలు పెట్టుకున్నారు. ఓ వైపు విద్యార్థులు ఆందోళనలు, మరో వైపు ప్రభుత్వం ఇవాళ్టి నుంచి పరీక్షలు నిర్వహిస్తుండటంతో కోర్టు తీర్పు ఎలా వస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Similar News

News October 21, 2024

మాల్దీవ్స్ వెళ్లే భారతీయులకు గుడ్‌న్యూస్

image

మాల్దీవ్స్‌కు వెళ్లే భారతీయులకు ప్రెసిడెంట్ ముయిజ్జు గుడ్‌న్యూస్ చెప్పారు. అక్కడ UPI పేమెంట్స్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. దీంతో అక్కడ పేమెంట్స్ చేయడం భారతీయులకు సులభతరం కానుంది. డిజిటల్ పేమెంట్స్, ఫైనాన్షియల్ సర్వీసె‌స్‌లో సహకారం అందించేందుకు భారత్ అంగీకరించిన నేపథ్యంలో మాల్దీవ్స్‌లో యూపీఐ పేమెంట్స్‌ తీసుకురావాలని ఆయన నిర్ణయించారు.

News October 21, 2024

ఎలక్షన్స్ తర్వాత అమెరికా ‘బబుల్’ బరస్టేనా!

image

US ఎలక్షన్స్ తర్వాత ఏం జరుగుతుందోనని ప్రపంచమంతా భయపడుతోంది. అక్కడి బ్యాంకులు $500bns నష్టాల్లో ఉన్నాయి. లిక్విడిటీ లేదు. ఇక జాతీయ అప్పు $35trns. గోల్డ్, పెట్రోల్ లేకుండానే ప్రింట్ చేస్తున్న డాలర్లు చిత్తుకాగితాలతో సమానమని కియోసాకి లాంటి ఆంత్రప్రెన్యూర్స్, ఎకానమిస్టులు బాహాటంగా చెప్తున్నారు. BRICS కరెన్సీ వస్తే ఇక ఆగమాగమేనని, US బుడగ ఏ క్షణమైనా టప్‌మని పేలొచ్చని వార్నింగ్ ఇస్తున్నారు. మీ కామెంట్.

News October 21, 2024

BREAKING: బంగాళాఖాతంలో అల్పపీడనం

image

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది క్రమంగా వాయవ్య దిశగా పయనిస్తూ బలపడి వాయుగుండం, ఆపై తుఫానుగా మారుతుందని పేర్కొంది. ఈ తుఫానుకు ‘దానా’గా నామకరణం చేశారు. దీని ప్రభావంతో రానున్న రోజుల్లో ఏపీలో వర్షాలు పడతాయని, ఈ నెల 24 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.