News October 21, 2024
మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా చరిత్ర!

KNR మొదట 1905లోనే జిల్లాగా ఏర్పడింది. గతంలో భారత యూనియన్లో హైదరాబాద్ రాష్ట్రంగా విలీనమైన తర్వాత 1948లో కరీంనగర్ జిల్లాగా భాగమైంది. తెలుగు మాట్లాడే పేరొందిన క్రమంలో 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేశారు. 2014లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాగా ఏర్పడింది. కాగా, నిజాంపాలనలో(1724-1948)అసఫ్ జాహి రాజవంశీయుల ఆధీనంలో ఉంది.1937లో షైఖాన్ బిన్ షైక్ సాలేహ్ కరీంనగర్ కమాన్ నిర్మించారు.
Similar News
News December 29, 2025
KNR: జిల్లాలో యూరియా నిల్వలు పుష్కలం: కలెక్టర్

కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ప్రస్తుతం 4,246 మెట్రిక్ టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని కోరారు. విక్రయ కేంద్రాల వద్ద తాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అక్రమ నిల్వలు సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
News December 29, 2025
KNR: మహిళా కూలీలతో అసభ్య ప్రవర్తన.. ఫీల్డ్ అసిస్టెంట్ తొలగింపు

మానకొండూరు మండలం పచ్చునూరులో ఉపాధి హామీ మహిళా కూలీలతో అసభ్యంగా ప్రవర్తించిన ఫీల్డ్ అసిస్టెంట్ కురాకుల పోచాలును విధుల్లో నుంచి తొలగిస్తూ DRDO ఉత్తర్వులు జారీ చేశారు. గతంలోనూ సస్పెండై వివాదాస్పదుడైన వ్యక్తిని అధికారులు తిరిగి విధుల్లోకి ఎలా తీసుకున్నారో వారికే తెలియాలని గ్రామస్థులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
News December 28, 2025
కరీంనగర్: రేపటి నుంచి యథావిధిగా ‘ప్రజావాణి’

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమం సోమవారం నుంచి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగే ఈ కార్యక్రమానికి అర్జీదారులు హాజరుకావాలని సూచించారు. వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.


